Bandi Sanjay : ట్విట్టర్ టిల్లు.. లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు.. బండి సంజయ్ కౌంటర్
- "ట్విట్టర్ టిల్లు" అంటూ బండి సంజయ్ ఘాటు విమర్శలు
- "నీ చీకటి రహస్యాలు బయటపడతాయి".. బండి సంజయ్ హెచ్చరిక
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ చెల్లెలు వ్యాఖ్యలపై సంచలనం
- కేటీఆర్పై బండి సంజయ్ తీవ్ర రాజకీయ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపధ్యంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేటీఆర్ను ఉద్దేశిస్తూ బండి సంజయ్, “ట్విట్టర్ టిల్లు.. నువ్వు చేసిన అక్రమాలను మర్చిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు” అంటూ వ్యాఖ్యానించారు. లీగల్ నోటీసుల వెనక దాక్కుంటూ మాట్లాడే నీలో ధైర్యం లేదని, గతంలో కూడా ఇదే ప్రయత్నం చేసి విఫలమయ్యావని సంజయ్ విమర్శించారు.
KTR : బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి
Also Read
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
“నీ చిల్లర చేష్టలకు నేను భయపడను. ధైర్యం ఉంటే ముఖాముఖి రా” అంటూ ఆయన సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, రాఖీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ సొంత చెల్లెలు భయంతో పారిపోతుందని సంజయ్ ఆరోపించారు. “ఆమె స్వయంగా ఫోన్ ట్యాపింగ్ను అంగీకరించిందని” ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. “48 గంటలు గడువు అంటున్నావ్ కానీ, నీ సమయం సమీపించింది. నీ చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. నీకు దాక్కోవడానికి ఎటూ చోటు ఉండదు” అని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇంతటితో ఆగకుండా, “నీ అక్రమాలను సమర్థించుకోవడం ఎంత సులభమో, బీజేపీ నాయకులను బతిమాలి పార్టీ విలీనం చేయడం, లేదా ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమంత్రిని కోరడం కూడా అంతే సులభంగా జరిగేదై ఉండేది” అంటూ బండి సంజయ్ తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రెండు పెద్ద పార్టీల నేతల మధ్య విమర్శల యుద్ధం పచ్చి రాజకీయంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంతదాకా వెళ్లనుంది? లీగల్ నోటీసులు ఏమవుతాయి? అనే అంశాలపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!