విద్యుత్ సవరణ బిల్లుపై పోరాటం.. కేటీపీపీలో రోడెక్కిన కార్మికలోకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ కోర్దినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ అధ్వర్యంలో కేటీపీపీ 11వందల మెగావాట్ల ప్రధాన ద్వారం ముందు అన్నీ అసోసియేషన్లు,ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన చేపట్టారు. విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు నిచ్చింది.
ఇందులో భాగంగా చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)1, 2 దశల కర్మాగారాల ఉద్యోగులు, కార్మికులు బుధవారం విధులను బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ప్రధాన గేటు వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు. దేశాభివృద్ధిలో భాగమైన విద్యుత్తు సంస్థలను, కేంద్ర ప్రభుత్వం తన మిత్రులుగా ఉన్న కొన్ని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న విద్యుత్ సంస్థలు దేశంలోని 25 కోట్ల వినియోగదారులు, వ్యవసాయదారులు, పరిశ్రమ వర్గాలకు సరళమైన విద్యుత్తును అందిస్తున్నాయి.
Also Read
అలాంటి విద్యుత్ సంస్థలను ప్రభుత్వానికి సన్నిహితులుగా మెలుగుతున్న బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రైవేటు పరం చేయ్యాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన కోణంలో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థను విద్యుత్ సవరణ బిల్లు ద్వారా లాభార్జనతో పనిచేసే ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనే ప్రయత్నాలను విద్యుత్ ఉద్యోగులందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సవరణ బిల్లు ద్వారా మన రాష్ట్రంలో 50 వేల మంది విద్యుత్ ఉద్యోగులు, సుమారు కోటి తొంబై లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై ప్రభావం పడబోతోందన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని, ప్రమాదాలు పెరుగుతాయని, ప్రజలపై అధిక ఛార్జీల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..