కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది.. రేపు జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది కేఆర్ఎంబీ.. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదంతో కీలకంగా మారింది కేఆర్ఎంబీ సమావేశం… ఈ విషయంలో ఇప్పటికే కేఆర్ఎంబీకి లేఖలు కూడా వెళ్లాయి.. అయితే, కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది.. ఈ నెల 20 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఏపీ లేవనెత్తిన అంశాలను మాత్రమే సమావేశాల ఎజెండాలో చేర్చారని, తెలంగాణ అభ్యంతరాలను విస్మరించారని ఆక్షేపించారు. దీంతో.. మరోసారి సమావేశం వాయిదా పడింది.. కాగా, జల వివాదంలో ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం విదితమే.