MLA Seethakka: మోడీకి, కేసీఆర్కి తేడా లేదు.. నోటీసులు ఇవ్వడమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Fires On Modi and KCR: ప్రధాని మోడీకి, సీఎం కేసీఆర్కు తేడా లేదంటూ ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. కొమురం భీమ్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆమె.. లీకుల విషయంలో ఆరోపణలు చేస్తే, విచారణ జరపాల్సింది పోయి నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉన్న ఆదారాలతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక యువత సెల్ఫోన్, మద్యానికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఉద్యోగం కోసం కష్ట పడితే.. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి, తమ దగ్గర వాళ్లకు ఇచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ అయినప్పుడు.. ఆ భాధ్యత ప్రభుత్వానిది కాకపోతే ఇంకెవరిది ఉంటుందని నిలదీశారు. వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే మాకేం సంబంధం అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సిట్ అధికారి కేసీఅర్కు దగ్గరి వక్తేనని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక.. నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని మండిపడ్డారు. సిట్ కాదు.. సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్
Also Read
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
- Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..
అంతకుముందు.. ఈ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టేసి.. కేవలం తమ వారి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సింగరేణిలో కూడా ఇలాగే అవకతవకలు జరిగాయన్నారు. లాంగ్ జంప్ తగ్గించాలని ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జామ్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాదని, అభ్యర్థులకు వచ్చిన మార్కుల లిస్ట్ని బయటపెట్టాలని కోరారు. మధ్యం, పబ్స్, బెల్ట్ షాపుల్లో మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వమే యువతను మద్యానికి బానిస చేస్తోందని అన్నారు. పేపర్ లీకేజ్తో టీఎస్పీఎస్సీపై నమ్మకం పోయిందని, ఈ లీకేజ్లో అధికార పార్టీ లీడర్ల పాత్ర ఉంది కాబట్టే మార్కుల లిస్ట్ని బయటపెట్టడం లేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువతను మభ్యపెడుతున్నాయని.. యువతకు ఆశ పెట్టి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పుతున్నారని వెల్లడించారు.
Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!