MLA Seethakka: మోడీకి, కేసీఆర్కి తేడా లేదు.. నోటీసులు ఇవ్వడమేంటి?
MLA Seethakka Fires On Modi and KCR: ప్రధాని మోడీకి, సీఎం కేసీఆర్కు తేడా లేదంటూ ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. కొమురం భీమ్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆమె.. లీకుల విషయంలో ఆరోపణలు చేస్తే, విచారణ జరపాల్సింది పోయి నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉన్న ఆదారాలతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక యువత సెల్ఫోన్, మద్యానికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఉద్యోగం కోసం కష్ట పడితే.. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి, తమ దగ్గర వాళ్లకు ఇచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ అయినప్పుడు.. ఆ భాధ్యత ప్రభుత్వానిది కాకపోతే ఇంకెవరిది ఉంటుందని నిలదీశారు. వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే మాకేం సంబంధం అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సిట్ అధికారి కేసీఅర్కు దగ్గరి వక్తేనని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక.. నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని మండిపడ్డారు. సిట్ కాదు.. సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్
Also Read
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
- Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..
అంతకుముందు.. ఈ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టేసి.. కేవలం తమ వారి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సింగరేణిలో కూడా ఇలాగే అవకతవకలు జరిగాయన్నారు. లాంగ్ జంప్ తగ్గించాలని ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జామ్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాదని, అభ్యర్థులకు వచ్చిన మార్కుల లిస్ట్ని బయటపెట్టాలని కోరారు. మధ్యం, పబ్స్, బెల్ట్ షాపుల్లో మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వమే యువతను మద్యానికి బానిస చేస్తోందని అన్నారు. పేపర్ లీకేజ్తో టీఎస్పీఎస్సీపై నమ్మకం పోయిందని, ఈ లీకేజ్లో అధికార పార్టీ లీడర్ల పాత్ర ఉంది కాబట్టే మార్కుల లిస్ట్ని బయటపెట్టడం లేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువతను మభ్యపెడుతున్నాయని.. యువతకు ఆశ పెట్టి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పుతున్నారని వెల్లడించారు.
Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!