Winter Weather: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
- తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
- భారీగా పెరుగుతున్న చలి తీవ్రత..
- రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Winter Weather: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డవుతున్నాయి. సిర్పూర్(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Read Also: Constitution Day: నేడే భారత రాజ్యాంగ దినోత్సవం.. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన వేడుకలు
Also Read
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
- Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..
ఇక, సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తి డిస్ట్రిక్ లో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడూ రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.
Read Also: Koti Deepotsavam Day -17: కన్నుల పండుగగా.. యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం
కాగా, మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయికి పడిపోతుంటాయి. కానీ, ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. 10 ఏళ్లతో పోల్చితే ఈ నెల 23న రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!