Koti Deepotsavam Day -17: కన్నుల పండుగగా.. యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం
- అంబరాన్నంటే మహాసంబరం
- భువిపై సాక్షాత్కరించే ఇలకైలాసం
- భక్తులందరిచేత.. మహాదేవునికి అర్చన
- అనిర్వచనీయం.. స్వర్ణలింగోద్భవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam Day -17: భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024 నేడు చివరి రోజు వైభవోపేత వేడుకల మధ్య ముగిసింది. శంఖారావంతో ప్రారంభమైన పదిహేడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. వేదపఠనంతో ప్రారంభమైంది. వరాలు అనుగ్రహించడానికి పరమేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంగణంలో “ప్రదోషకాల అభిషేకం” నిర్వహించారు. భక్తి గీతాలు.. వేణు వాయిద్యం.. కోటి దీపోత్సవంలో పదిహేడవ రోజు శ్రీ దివి నరసింహ దీక్షితులు గారి ప్రవచనామృతం అందిరినీ ఆకట్టుకుంది.. వేదిక పైకి యాదగిరిగుట్ట, కీసరగుట్ట కల్యాణమూర్తుల ఆగమనం, ఈతి బాధలు తొలగించే.. శివపరివారానికి భక్తులచే కోటి రుద్రాక్షల అర్చన, మనోభీష్టాలు నెరవేర్చే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం.. మొట్టమొదటిసారిగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగాయి.
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
కార్తిక సోమవార శుభవేళ భక్తులను అనుగ్రహించడానికి నందివాహనంపై ఆదిదంపతులు విచ్చేశారు. తమిళనాడు ధర్మపురి ఆధీనం పీఠాధిపతి శ్రీ మాసిల్లమణి దేశిగ జ్ఞానసంబంధ స్వామీజీ వారి అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకుంది. నేటి అతిథి ముఖ్యత అతిథిగా మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఇలా కైలాసంలో కార్తికమాసం వేళ భక్తి, ఎన్టీవీ వారు చేపుడుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మికను మరింత ముందుకు తీసుకువెళ్తుందున్నారు. అలాగే.. పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన చేశారు. అంతేకాకుండా.. తమిళనాడు ధర్మపురి ఆధీనం పీఠాధిపతి శ్రీ మాసిల్లమణి దేశిగ జ్ఞానసంబంధ స్వామీజీ వారికి గురు వందనం.. మరాఠీ నృత్యం, అమ్మవార్ల నృత్యం, మహిళల డప్పు నృత్యం, పుణే డోలు వాయిద్యం, సాంస్కృతిక కదంబం (కోలాటం), మహా మంగళ హారతి దర్శనంతో కోటి దీపోత్సవ వేడుకలు ముగిశాయి.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!