Kodandaram ఫేస్ టు ఫేస్ : కేసీఆర్ని ఎవరూ నమ్మడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో మాట్లాడితే సరిపోతుంది. కేంద్రం-తెలంగాణ ఘర్షణ పడితే మంచిదికాదన్నారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు ప్రొఫెసర్ కోదండరాం.
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
తెలంగాణ దేశంలో అంతర్భాగం. ప్రజల ప్రయోజనాల రీత్యా మేం చెప్పే సలహాలు, సూచనలు పరిశీలించడానికి ప్రభుత్వానికి తీరిక లేదు. మేం చెప్పింది వినలేదు. ఉద్యమంలో చెప్పింది ఒకటి. చేసింది ఒకటి. బయట వుండి చెబితే కుదరదు. మాతో లేనివారు వ్యతిరేక శక్తులని భావించే వారు. మేం కుర్చీలు అడగలేదు. కీర్తి కీరిటాలు కోరలేదు. కేసీఆర్ కి తెలియకుండా సోనియాను కలవడం అనేది జరిగి వుండవచ్చు. తెలంగాణ ఇవ్వమని సోనియాను అడిగాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మా అభిప్రాయాలు తెలుసుకున్నారు. మేం ఎవరికీ మద్దతివ్వలేదు. రాజకీయాలకు దూరంగా వుండాలని దూరంగా వున్నాం. కాంగ్రెస్ వారు కూడా మేం సహకరించాం. మీరూ మాకు సహకరించాలన్నారు. కానీ మేం అలా కుదరదని చెప్పాం అన్నారు కోదండరాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. అన్ని పార్టీలు కలిసి ముందుకెళితే బాగుంటుందన్నారు కోదండరాం.
తెలంగాణ జన సమితిని విలీనం చేస్తారనే వార్తలపై ప్రొఫెసర్ కోదండరాం స్పష్టమైన బదులిచ్చారు. విలీనం అనేది చర్చే లేదు. ఆప్ లో విస్తరిస్తున్న వేళ టీజెఎస్ తో కలిసి నడుస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఆప్ తో చర్చ జరగలేదు. కలవాలి, మాట్లాడాలని అనుకున్నాం. వాళ్ళ ఆలోచన ఎలా వుంది, మా ఆలోచన ఎలా వుంది అనేది చూడాలి. గతంలో అనేక పార్టీలతో కలిసి పనిచేశాం. సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ లతో కలిసి పనిచేశాం. టీజేఏసీలో వున్న యాక్టివ్ నెస్ పార్టీ విషయంలో లేదు. నెట్ వర్క్ గతంలో కంటే ఎక్కువగా వుంది. పార్టీకి క్యాడర్ బాగానే ఉంది. ఎన్నికల్లో పోటీచేయాలంటే భారీగా డబ్బు వుండాలనే భావన ఉందన్నారు ప్రొఫెసర్ కోదండరాం.
రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి. ప్రజలకు అవగాహన కలిగించాలి. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కలిసి పనిచేయడం అంత సులభం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి వస్తారని అనుకోవడం లేదు. ఎవరి లక్ష్యాలు వారికుంటాయి. బీజేపీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దాం. మా అస్థిత్వం వదులుకుని పనిచేయడం అనేది సాధ్యం కాదని అనేకసార్లు చెప్పాం అన్నారు కోదండరాం.
కేసీఆర్ దేశ రాజకీయాలు మార్చే పనిలో వున్నారు. తెలంగాణలో ఆయన వ్యవహారం బాగా నడిపితే కలిసి వచ్చే అవకాశం వుంటుంది. ఆయన్ని ఎవరూ నమ్మరు. వ్యతిరేకతను తగ్గించుకోగలరు. దేశరాజకీయాల్లో పెద్దవారితో కలిసి పనిచేస్తే ఆయన బలం పెరిగే అవకాశం వుంది. బలమయిన నేతలతో కలిసి పనిచేస్తే ప్రయోజనం వుంటుంది. కానీ కేసీఆర్ హైదరాబాద్ ని వదిలి వెళ్ళడన్నారు ప్రొఫెసర్ కోదండరాం.
తాజావార్తలు
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!