Kodandaram ఫేస్ టు ఫేస్ : కేసీఆర్ని ఎవరూ నమ్మడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో మాట్లాడితే సరిపోతుంది. కేంద్రం-తెలంగాణ ఘర్షణ పడితే మంచిదికాదన్నారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు ప్రొఫెసర్ కోదండరాం.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
తెలంగాణ దేశంలో అంతర్భాగం. ప్రజల ప్రయోజనాల రీత్యా మేం చెప్పే సలహాలు, సూచనలు పరిశీలించడానికి ప్రభుత్వానికి తీరిక లేదు. మేం చెప్పింది వినలేదు. ఉద్యమంలో చెప్పింది ఒకటి. చేసింది ఒకటి. బయట వుండి చెబితే కుదరదు. మాతో లేనివారు వ్యతిరేక శక్తులని భావించే వారు. మేం కుర్చీలు అడగలేదు. కీర్తి కీరిటాలు కోరలేదు. కేసీఆర్ కి తెలియకుండా సోనియాను కలవడం అనేది జరిగి వుండవచ్చు. తెలంగాణ ఇవ్వమని సోనియాను అడిగాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మా అభిప్రాయాలు తెలుసుకున్నారు. మేం ఎవరికీ మద్దతివ్వలేదు. రాజకీయాలకు దూరంగా వుండాలని దూరంగా వున్నాం. కాంగ్రెస్ వారు కూడా మేం సహకరించాం. మీరూ మాకు సహకరించాలన్నారు. కానీ మేం అలా కుదరదని చెప్పాం అన్నారు కోదండరాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. అన్ని పార్టీలు కలిసి ముందుకెళితే బాగుంటుందన్నారు కోదండరాం.
తెలంగాణ జన సమితిని విలీనం చేస్తారనే వార్తలపై ప్రొఫెసర్ కోదండరాం స్పష్టమైన బదులిచ్చారు. విలీనం అనేది చర్చే లేదు. ఆప్ లో విస్తరిస్తున్న వేళ టీజెఎస్ తో కలిసి నడుస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఆప్ తో చర్చ జరగలేదు. కలవాలి, మాట్లాడాలని అనుకున్నాం. వాళ్ళ ఆలోచన ఎలా వుంది, మా ఆలోచన ఎలా వుంది అనేది చూడాలి. గతంలో అనేక పార్టీలతో కలిసి పనిచేశాం. సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ లతో కలిసి పనిచేశాం. టీజేఏసీలో వున్న యాక్టివ్ నెస్ పార్టీ విషయంలో లేదు. నెట్ వర్క్ గతంలో కంటే ఎక్కువగా వుంది. పార్టీకి క్యాడర్ బాగానే ఉంది. ఎన్నికల్లో పోటీచేయాలంటే భారీగా డబ్బు వుండాలనే భావన ఉందన్నారు ప్రొఫెసర్ కోదండరాం.
రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి. ప్రజలకు అవగాహన కలిగించాలి. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కలిసి పనిచేయడం అంత సులభం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి వస్తారని అనుకోవడం లేదు. ఎవరి లక్ష్యాలు వారికుంటాయి. బీజేపీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దాం. మా అస్థిత్వం వదులుకుని పనిచేయడం అనేది సాధ్యం కాదని అనేకసార్లు చెప్పాం అన్నారు కోదండరాం.
కేసీఆర్ దేశ రాజకీయాలు మార్చే పనిలో వున్నారు. తెలంగాణలో ఆయన వ్యవహారం బాగా నడిపితే కలిసి వచ్చే అవకాశం వుంటుంది. ఆయన్ని ఎవరూ నమ్మరు. వ్యతిరేకతను తగ్గించుకోగలరు. దేశరాజకీయాల్లో పెద్దవారితో కలిసి పనిచేస్తే ఆయన బలం పెరిగే అవకాశం వుంది. బలమయిన నేతలతో కలిసి పనిచేస్తే ప్రయోజనం వుంటుంది. కానీ కేసీఆర్ హైదరాబాద్ ని వదిలి వెళ్ళడన్నారు ప్రొఫెసర్ కోదండరాం.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!