Kodandaram ఫేస్ టు ఫేస్ : కేసీఆర్ని ఎవరూ నమ్మడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో మాట్లాడితే సరిపోతుంది. కేంద్రం-తెలంగాణ ఘర్షణ పడితే మంచిదికాదన్నారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు ప్రొఫెసర్ కోదండరాం.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ దేశంలో అంతర్భాగం. ప్రజల ప్రయోజనాల రీత్యా మేం చెప్పే సలహాలు, సూచనలు పరిశీలించడానికి ప్రభుత్వానికి తీరిక లేదు. మేం చెప్పింది వినలేదు. ఉద్యమంలో చెప్పింది ఒకటి. చేసింది ఒకటి. బయట వుండి చెబితే కుదరదు. మాతో లేనివారు వ్యతిరేక శక్తులని భావించే వారు. మేం కుర్చీలు అడగలేదు. కీర్తి కీరిటాలు కోరలేదు. కేసీఆర్ కి తెలియకుండా సోనియాను కలవడం అనేది జరిగి వుండవచ్చు. తెలంగాణ ఇవ్వమని సోనియాను అడిగాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మా అభిప్రాయాలు తెలుసుకున్నారు. మేం ఎవరికీ మద్దతివ్వలేదు. రాజకీయాలకు దూరంగా వుండాలని దూరంగా వున్నాం. కాంగ్రెస్ వారు కూడా మేం సహకరించాం. మీరూ మాకు సహకరించాలన్నారు. కానీ మేం అలా కుదరదని చెప్పాం అన్నారు కోదండరాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. అన్ని పార్టీలు కలిసి ముందుకెళితే బాగుంటుందన్నారు కోదండరాం.
తెలంగాణ జన సమితిని విలీనం చేస్తారనే వార్తలపై ప్రొఫెసర్ కోదండరాం స్పష్టమైన బదులిచ్చారు. విలీనం అనేది చర్చే లేదు. ఆప్ లో విస్తరిస్తున్న వేళ టీజెఎస్ తో కలిసి నడుస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఆప్ తో చర్చ జరగలేదు. కలవాలి, మాట్లాడాలని అనుకున్నాం. వాళ్ళ ఆలోచన ఎలా వుంది, మా ఆలోచన ఎలా వుంది అనేది చూడాలి. గతంలో అనేక పార్టీలతో కలిసి పనిచేశాం. సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ లతో కలిసి పనిచేశాం. టీజేఏసీలో వున్న యాక్టివ్ నెస్ పార్టీ విషయంలో లేదు. నెట్ వర్క్ గతంలో కంటే ఎక్కువగా వుంది. పార్టీకి క్యాడర్ బాగానే ఉంది. ఎన్నికల్లో పోటీచేయాలంటే భారీగా డబ్బు వుండాలనే భావన ఉందన్నారు ప్రొఫెసర్ కోదండరాం.
రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి. ప్రజలకు అవగాహన కలిగించాలి. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కలిసి పనిచేయడం అంత సులభం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి వస్తారని అనుకోవడం లేదు. ఎవరి లక్ష్యాలు వారికుంటాయి. బీజేపీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దాం. మా అస్థిత్వం వదులుకుని పనిచేయడం అనేది సాధ్యం కాదని అనేకసార్లు చెప్పాం అన్నారు కోదండరాం.
కేసీఆర్ దేశ రాజకీయాలు మార్చే పనిలో వున్నారు. తెలంగాణలో ఆయన వ్యవహారం బాగా నడిపితే కలిసి వచ్చే అవకాశం వుంటుంది. ఆయన్ని ఎవరూ నమ్మరు. వ్యతిరేకతను తగ్గించుకోగలరు. దేశరాజకీయాల్లో పెద్దవారితో కలిసి పనిచేస్తే ఆయన బలం పెరిగే అవకాశం వుంది. బలమయిన నేతలతో కలిసి పనిచేస్తే ప్రయోజనం వుంటుంది. కానీ కేసీఆర్ హైదరాబాద్ ని వదిలి వెళ్ళడన్నారు ప్రొఫెసర్ కోదండరాం.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!