Kodanda Reddy : బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధరణి పోర్టల్పై ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంత మొత్తుకున్నా .. అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను భయపెట్టి, అక్రమ కేసులు పెట్టి భూమిని ఆక్రమించుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని రైతులు డిమాండ్ చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. ఎందుకు నాగారంలో ఉన్న భూములను మాత్రమే ఎందుకు నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన అన్నారు.
అసైన్డ్ భూములు భూస్వాముల చేతుల్లోకి వెళ్ళడం సరికాదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చుట్టూ ఉండే చాలా మంది అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని, ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో మళ్ళీ భూస్వాముల కొమ్ముకాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలని, మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను బీజేపీ నాయకులకు అందించేందుకు మేము సిద్దంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోరని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ను తొలగించాలని, తిరిగి పాత సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ల కింద భూసేకరణలో ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తోందని, తక్కువ ధరలకు రైతుల నుంచి భూసేకరణ జరుగుతోందని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
-
School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
-
Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!