Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
- తెలంగాణ ప్రజల తరుఫున ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నా
- 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి
- ఒకేసారి తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టులా మార్చుతున్నాం -కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో భాగ్యనగరం అభివృద్ధి కాంతులతో మెరిసిపోతోంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా మాదాపూర్లోని హెచ్ఐసీసీ (HICC) కి చేరుకున్న ప్రధాని, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. సుమారు రూ. 9,400 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. 2014 కంటే ముందు రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు కేంద్రం చొరవతో అవి ఎంతలా మెరుగుపడ్డాయో ప్రజలు గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. గతంలో ప్రధాని పర్యటనలకు అప్పటి ముఖ్యమంత్రులు రాకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించినా, కేంద్రం మాత్రం రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!