Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
- తెలంగాణ ప్రజల తరుఫున ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నా
- 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి
- ఒకేసారి తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టులా మార్చుతున్నాం -కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో భాగ్యనగరం అభివృద్ధి కాంతులతో మెరిసిపోతోంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా మాదాపూర్లోని హెచ్ఐసీసీ (HICC) కి చేరుకున్న ప్రధాని, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. సుమారు రూ. 9,400 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. 2014 కంటే ముందు రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు కేంద్రం చొరవతో అవి ఎంతలా మెరుగుపడ్డాయో ప్రజలు గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. గతంలో ప్రధాని పర్యటనలకు అప్పటి ముఖ్యమంత్రులు రాకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించినా, కేంద్రం మాత్రం రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?