Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Promises Cotton Purchase Support For Telangana Farmers

Kishan Reddy : కొత్త మొబైల్ యాప్‌తో పత్తి సేకరణలో రద్దీకి చెక్

Published Date :October 8, 2025 , 10:54 am
By Gogikar Sai Krishna
  • తెలంగాణ పత్తి రైతులకు కిషన్ రెడ్డి భరోసా
  • “ప్రతి కిలో పత్తిని కేంద్రం కొనుగోలు చేస్తుంది” – కిషన్ రెడ్డి
  • కొత్త మొబైల్ యాప్‌తో పత్తి సేకరణలో రద్దీకి చెక్
  • రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి కీలక సూచనలు
Kishan Reddy : కొత్త మొబైల్ యాప్‌తో పత్తి సేకరణలో రద్దీకి చెక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ పత్తి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు పండించే ప్రతి కిలో పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో పత్తి సేకరణపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. రైతులకు సజావుగా, ఇబ్బందులు లేకుండా పత్తి సేకరణ జరిగేలా కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

గత ఏడాది తెలంగాణలో ఉత్పత్తి అయిన పత్తిలో దాదాపు 80 శాతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొనుగోలు చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రైతులకు చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని, ఇది పారదర్శకతను పెంచి అవినీతికి తావు లేకుండా చేస్తుందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కూడా ఆయన అభ్యర్థించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధరలు తగ్గినా, భారత రైతులకు నష్టం కలగకుండా కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. రైతులు తమ పంటను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయించకుండా ఉండాలని, కేంద్రం పూర్తి అండగా ఉంటుందని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం పత్తి కొనుగోలు సమయంలో జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పడే రద్దీని తగ్గించేందుకు కేంద్రం కొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులకు సమయ స్లాట్‌లను కేటాయించి సజావుగా సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇది ఆలస్యాన్ని నివారించడమే కాకుండా మధ్యవర్తుల జోక్యాన్ని కూడా తగ్గిస్తుందని వివరించారు.

Fake PMO Letter Scam: చీటింగ్ చేయడం కోసం ప్రధాని కార్యాలయాన్ని వాడుకున్న వ్యక్తి.. కట్‌చేస్తే..

పత్తి సేకరణ కేంద్రాలకు తేమ శాతం తక్కువగా ఉండేలా పత్తిని తీసుకురావాలని, రైతులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు. పత్తిని ఎండబెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం MGNREGA నిధులను వినియోగించుకోవచ్చని తెలిపారు. అధిక సాంద్రత కలిగిన పత్తి విత్తనాల వాడకం రైతుల ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుతుందని కేంద్రం సిఫార్సు చేసినప్పటికీ, రాష్ట్రం ఈ విత్తనాలను ఇంకా అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 122 కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, రైతు కమిటీలు తక్షణ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. తేమ శాతం కొలవడానికి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పత్తి సేకరణలో ప్రతి దశలో పారదర్శకత, న్యాయం ఉండేలా చూడాలని సూచించారు. రైతులు 12 శాతం కంటే తక్కువ తేమ ఉన్న పత్తిని తీసుకురావాలని, అయితే తేమ శాతం కొంచెం ఎక్కువగా ఉన్న పత్తిని తిరస్కరించకుండా మార్గనిర్దేశం చేయాలని అధికారులకు సూచించారు.

Gold Rate Today: రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తున్న బంగారం.. ఇవాళ రూ. 1150 పెరిగిన గోల్డ్ ధర

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture news
  • central government
  • cotton procurement
  • Kishan Reddy
  • telangana farmers

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions