Kishan Reddy : కేసీఆర్ నిజాం పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక మంత్రి పోలీసులపై తీసుకొని వచ్చిన ఒత్తిడి కారణంగా సాయి గణేష్ వాంగ్మూలం రికార్డ్ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఖమ్మం సంఘటన అందుకు అద్దం పడుతుందని, తెలంగాణలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డుల్లో ఖర్చు చేయడం లేదని, అనేక సర్వేలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు.
రైతు బంధు నుంచి దళిత బంధు టీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఒక్కడి కారణంగా తెలంగాణ రాలేదని, 12 వందల మంది ఆత్మహత్యల కారణంగా తెలంగాణ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. 12 వందల మంది ఆత్మబలిదానాలు వృధా పోవని, గత రెండు ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎలా గెలిపించారో అలాగే ఒడిస్తారని ఆయన హెచ్చరించారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంపై బీజేపీ పోరాటం చేస్తుందని, టీఆర్ఎస్ అవినీతి అరాచక పాలనపై బీజేపీ పోరాటం చేస్తుంటే తెలంగాణ సెంటిమెంట్ కు లింక్ పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కేంద్రం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా ? అని ఆయన సవాల్ విసిరారు. కరోనా కారణంగా వ్యాక్సిన్ కానీ, మీరు తెస్తున్న 90 శాతం అప్పులు రాష్టానికి కేంద్రం ఇస్తుందని, కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు బుద్ధి చెపుతారన్నారు.
ఎన్ని వేల కోట్ల అక్రమ డబ్బు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, కేసీఆర్ నిజాం తరహా పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని, బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మబలి దానం వృధా పోదన్నారు. సచివాలయం లేని తెలంగాణ, సచివాలయంకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్, కేసీఆర్ కుటుంబ పాలనకు అతీతంగా ఒక నీతి వంత పాలన తెస్తామన్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!