Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Fires On Cm Kcr 11

Kishan Reddy : గతంలో ఇచ్చిన హామీలు మరిచి మభ్యపెట్టేందుకు కొత్తవి ఇస్తున్నారు

Published Date :October 15, 2023 , 10:14 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : గతంలో ఇచ్చిన హామీలు మరిచి మభ్యపెట్టేందుకు కొత్తవి ఇస్తున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి. సకల జనుల ద్రోహి కేసీఆర్​, గతంలో ఇచ్చిన హామీలు మరిచి మభ్యపెట్టేందుకు కొత్తవి ఇస్తున్నారన్నారు కిషన్‌ రెడ్డి. దళితుడిని సీఎం ఎప్పుడు చేస్తావ్​? దళితులకు మూడు ఎకరాలు ఏమైంది? నిరుద్యోగ భృతి ఒక్కరికన్నా ఇచ్చినవా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ఎన్నికల ప్రణాళిక బయటపెట్టారని,
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న కేసీఆర్​ తీరన్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల స్థలం, నిరుద్యోగ భృతి, నిజాం షుగర్​ ఫ్యాక్టరీ ఓపెనింగ్​, మహిళా సంఘాలకు పావలా వడ్డీ, రైతు రుణ మాఫీ, ఉచిత ఎరువులు.. ఇలా వందల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్ను పోటు పొడిచిన నయవంచకుడు కేసీఆర్​ అని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

అంతేకాకుండా.. ‘ఆయన చెప్పే మాటలకు.. చేసే చేతలకు.. వళ్లించే చిలుకపలుకులకు పొంతన లేదు. ఎన్నికల హామీలు.. నీటి మూటలే తప్ప.. ఎందులోనూ చిత్త శుద్ది లేదు. అప్పులు పెంచారు, అవినీతి పెంచారు, అహంకారం పెంచుకున్నారు తప్ప.. రాష్ట్ర సంపద పెంచలేదు. బెస్ట్​ ఎకనమికల్​ పాలసీ అని కేసీఆర్​ అంటున్నాడు… అది బెస్ట్​ కాదు.. వరెస్ట్​ ఎకనామికల్​ పాలసీ. పవర్​ పాలసీ బెస్ట్​ పాలసీ అని అన్నడు.. అది బెస్ట్​ కాదు.. డేంజర్​ పవర్​ పాలసీ. రూ.45 వేల కోట్ల అప్పులతో డిస్కంలు, విద్యుత్​ వ్యవస్థ కుప్పుకూలిపోయే స్థితిలో ఉన్నది. బెస్ట్​ డ్రింకింగ్​ వాటర్​ పాలసీ అట.. అది బెస్ట్​ డ్రింకింగ్​ వాటర్​ పాలసీ కాదు.. బెస్ట్​ లిక్కర్​ డ్రింకింగ్​ పాలసీ. బెస్ట్​ ఇరిగేషన్​ పాలసీ.. అన్నడు.. అది బెస్ట్​ కమిషన్​ ఇరిగేషన్​ పాలసీ. అత్యుత్తమ దళిత పాలసీ అని కేసీఆర్​ అంటున్నాడు.. కానీ కేసీఆర్​ బెస్ట్​ కరప్షన్​ ఫ్యామిలీ పాలసీ, చీటింగ్​ పాలసీ అమలుచేస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. కొత్తవి ఇస్తున్నారు.

కేసీఆర్​ సకల జనుల ద్రోహి… ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల చెవుల్లో గులాబీ పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలన చూశాం. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 2014, 2018, అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో కేసీఆర్​ బయట పెట్టి మాట్లాడాలి. 24 జిల్లా కేంద్రాల్లో నిమ్స్​ స్థాయిలో 24 హాస్పిటల్స్​ కడుతామని హామీ ఇచ్చి ఒక్కటి కూడా కట్టలేదు. 3 ఎకరాల సాగు భూమి, దళితులకు 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు, సబ్​ ప్లాన్​ నిధులు దారిమళ్లించకుండా చూడటం, మహిళా బ్యాంకులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, జర్నలిస్టులకు హెల్త్​ కార్డులకు… జర్నలిస్టుల సంక్షేమ నిధి, జర్నలిస్టుల భవనం… లాంటి ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. ప్రవాస భారతీయ విధానం తెస్తామన్నారు..

10 ఏండ్లు అయినా కాలేదు. మూతపడ్డ కంపెనీలు ఓపెన్​ చేస్తామని ఒక్కటీ ఓపెన్​ చేయలేదు. హైదరాబాద్​ నుంచి వరంగల్​కు ఇండస్ట్రియల్​ కారిడార్​ అన్నరు.. అది ఎక్కడ పోయింది? ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ..ప్రతి గ్రామంలో ఇంటర్నెట్.. రోడ్లు ఇస్తమన్నారు ఏమైంది? కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామాలకు రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, పునరుజ్జీవనం చేస్తామన్నారు.. ఏదీ లేదు.. కార్పొరేషన్​ చేసి వదిలేశారు. ఎంఎంటీఎస్​ సెకండ్​ ఫేజ్​ పై నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్​ ఉత్తరాన ఎయిర్​పోర్ట్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తది అటుంచితే.. వరంగల్​ ఎయిర్​పోర్టుకు ల్యాండ్​ ఇవ్వమంటే ఇస్తలేరు. ఆకాశ హర్మాలు.. గ్రాఫిక్స్​చూపెట్టి ప్రజలను మభ్యపెట్టిన పార్టీ బీఆర్​ఎస్​. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అప్పులపాలు చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి కేసీఆర్​. ఎఫ్​ఆర్​బీఎం నుంచి తప్పించుకోవడానికి మూసీకి ఒక కార్పొరేషన్​, రోడ్లకు ఒక కార్పొరేషన్​.. హుస్సేన్​ సాగర్​కు ఒక కార్పొరేషన్​.., వాటర్​కు ఒక కార్పొరేషన్​, కాళేశ్వరంకు ఒక కార్పొరేషన్​.. ఇలా లెక్కలేనన్ని కార్పొరేషన్లు వేస్తున్నారు.

అనేక కార్పొరేషన్లు పెట్టి నాబార్డు, బ్యాంకుల్లో విచ్చలవిడిగా అప్పులు చేశారు. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా.. తెలంగాణను ఉద్దరిస్తామని మళ్లీ మేనిఫెస్టో చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వడ్డీలకే పోతుంది. ఫీజు రీయింబర్స్​మెంట్​, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతున్నా.. కేసీఆర్​ చెప్పేవి.. కళ్లిబొల్లి మాటలు.. వీరు చెప్పేవి అన్ని అబద్ధాలు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలది ప్రజలను మోసం చేసే చరిత్ర వీటిని ప్రజలు గమనించాలి. ప్రభుత్వ చేతగానితనంతో, పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేక.. నోటిఫికేషన్లు వాయిదా పడుతుంటే.. దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ​ఆందోళనలో ఉన్నారు. 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్​.. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అందుకే కేసీఆర్​ మాటలను ఇప్పుడు చదువుకున్నవారే కాదు.. చదువు రాని వారు కూడా నమ్మే పరిస్థితి లేదు. 90 లక్షల మందికి మేలు చేస్తామంటే.. ప్రజలు నమ్మరు. పెట్రోల్​ మీద కేంద్రం తమకు వచ్చే ఆదాయం తగ్గించుకొని ట్యాక్స్​ తగ్గిస్తే… అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలిసి అవి కొంత ట్యాక్స్​ తగ్గించాయి. ట్యాక్స్​ తగ్గించన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మహిళా సంఘాలకు పావలా వడ్డీ.. తొమ్మిదేండ్లుగా ఇవ్వడం లేదు. ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం 500 రూపాలయ ధర తగ్గించారు.’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • BRS
  • cm kcr
  • Kishan Reddy

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • Rahul Gandhi: నేడు హైదరాబాద్కి రాహుల్ గాంధీ రాక..

  • Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత

  • T20 WC 2026 Semi Final Schedule: సెమీస్‌ షెడ్యూల్‌.. భారత్‌ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions