Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు..
- గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టాం..
- భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి..
- తుఫాను వరదల ప్రభావంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయాలి: మంత్రి తుమ్మల
Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ భద్రాద్రి నాది.. నా సొంతం అని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకి ఆదేశించారు.. జిల్లా మొత్తం తుఫాను వరదల ప్రభావంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి.. బాధితులకు వెంటనే డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కి మంత్రి సూచనలు చేశారు. రాముడు కరుణిస్తే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని.. రాజకీయపరంగా అధికారం పరంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాములవారికి సేవ చేసుకోవాలని తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.
Read Also: kanchana4 : కాంచనా 4లో దెయ్యంగా నటించనున్న పొడుగుకాళ్ల సుందరి..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
ఇక, ఈ తుఫాను వరదల కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగాలకి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందనలు తెలిపారు. గతంలో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లుగా పని చేసిన అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కేంద్రస్థాయిలో ఉన్నత స్థాయిలో పని చేస్తున్నారు అని గుర్తు చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారులు అందరూ భద్రాచలంపై ప్రేమను చూపిస్తున్నారు.. ఇప్పటికీ నాకు ఫోన్ చేసి సార్ మన భద్రాద్రి, ఎలా ఉంది అని అడుగుతున్నారు.. ఉన్నత అధికారుల అండదండలు మనకు ఉన్నాయి.. అధికారులు అంతా చిత్తశుద్ధితో పని చేసి భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసే విధంగా కృషి చేయాలి అని తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!