Mallu Bhatti Vikramarka: అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి..
- అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి..
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్ లో స్వయాన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ర్యాలీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంబేద్కర్ మీద కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే భారత దేశం అత్యున్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్వాతంత్య్ర భారత దేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోమ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు.
Read also: Advocate Varma: సంధ్యా థియేటర్ ఘటనపై సీన్ రీ కన్స్ట్రక్షన్.. లాయర్ ఏమన్నారంటే ?
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
అమిత్ షా ప్రవర్తన మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. అస్సలు ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలన్నారు. భారత రాజ్యాంగాన్ని అవమాణపరుస్తూ “పదే పదే అంబేద్కర్ అంబేద్కర్” అని నినదించడం సరికాదన్నారు. మహిళలకు సమాన హక్కు కల్పించింది భారత రాజ్యాంగమే అన్నారు. స్వాతంత్య్రాన్ని కలిగించింది భారత రాజ్యాంగమే? అన్నారు. మనం మాట్లాడే హక్కు కూడ భారత రాజ్యాంగం కల్పించిందే అని అన్నారు. అటువంటి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్ లో స్వయాన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
Read also: Allu Arjun: ప్రారంభమైన అల్లు అర్జున్ విచారణ.. బన్నీపై ప్రశ్నల వర్షం
మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచ దేశంలో అత్యున్నత రాజ్యాంగం కలిగిన దేశం.. భారత దేశం అన్నారు. దేశంలో అన్ని కులాలు, మతాలు అన్న దమ్ముళ్లా కలిసి ఉంటున్నామని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలు భారత దేశాన్ని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి, అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. భారత దేశానికి, జాతికి నిరసన తెలియజేయాలని ర్యాలీ నిర్వహించామన్నారు.
Allu Arjun Live Updates: పోలీస్ విచారణకు అల్లు అర్జున్.. లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!