Bhatti Vikramarka: గత పదేళ్ల నుండి బీఆర్ఎస్ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజక అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. డాక్టర్ రాగమయి దయానంద్ లు ప్రజా సేవ చేసిన నాయకులని తెలిపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి విచ్చలవిడిగా చేస్తుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హాయంలో ఒక్క అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పందిక్కొక్కుల్లాగ దోపిడీ చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని భట్టి మండిపడ్డారు.
Read Also: Rahul Gandhi: బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్ను ఓడించడమే..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులందరూ భారీ మెజారిటీతో గెలుపొందనున్నారు… ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యలేదని.. కేసీఆర్ కి బుద్ది ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు ఎకారానికి రూ.15000 ఇస్తాం.. బోనస్ గా 500, రైతుకూలీలకు 12000 ఇస్తామన్నారు. అంతేకాకుండా.. ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ విద్యార్ధులకు ఇస్తాం.. నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు. ఇవే కాక.. 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు.
Read Also: Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మేనిఫెస్ట్ ఎలా సాధ్యం అయింది అని కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. వారికి సిగ్గుండాలి.. ఈ రాష్ట్రంలో సంపద బాగా ఉంది కానీ, కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా మెక్కారు కాబట్టే అమలు చేయలేకపోయారన్నారు. ఈ ఎన్నికలు దొరలకు ప్రజల మధ్య జరిగే పోరాటం అని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలన్నది ప్రజలు ఆకాంక్ష అని పేర్కొన్నారు. అందుకోసమని సత్తుపల్లిలో రాగమయిని భారీ మెజారిటీతో గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.
తాజావార్తలు
-
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
-
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
-
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
-
Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
-
PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు