Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala CM Pinarayi Vijayan Speech In Khammam BRS Public Meeting: ఖమ్మంలో నిర్వహించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభలో కేరళ సీఎం పినరయి విజయన్.. కేంద్రంలోని బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా ఆరోపించారు. కేసీఆర్ చేపట్టిన పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇవాళ కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉందని.. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోందని.. బీజేపీ హయాంలో దేశంలోని రాజ్యాంగం సంక్షోభంలో పడిందని మండిపడ్డారు. రాష్ట్రాల సమ్మేళనమే మన భారతదేశమని.. ఫెడరల్ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదని అన్నారు.
Secretariat Dharma Case: చనిపోయి, బతికిన ధర్మా.. ట్విస్టులు రివీల్ చేసిన ఎస్పీ
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతోందని.. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోందని విజయన్ ఆరోపించారు. కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి పాలిస్తున్నాయని.. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఏయే రాష్ట్రాల్లో అయితే విపక్షాలు అధికారంలో ఉన్నాయో.. ఆ పార్టీల ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా పాస్ చేస్తున్నారని.. సంస్కరణల పేరుతో కేంద్రం నైతిక విధానాలను ఆచరిస్తోందని ఫైర్ అయ్యారు.
Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన
దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారని.. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విజయన్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారని.. కార్పొరేటర్లకు మోడీ తొత్తుగా మారారని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందని, కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ పథకాలు బాగున్నాయని, కేరళలోని వాటి అమలుకు ప్రయత్నిస్తానన్నారు. కేరళ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారని భరోసా కల్పించారు.
Minister KTR: తెలంగాణకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!