Minister KTR: తెలంగాణకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Nxtra To Build Hyper Scale Data Centre In Hyderabad: తెలంగాణకు మంత్రి కేటీఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తీసుకొచ్చారు. రూ. 2 వేల కోట్లతో భారతీ ఎయిర్టెల్ గ్రూప్ రాష్ట్రంలో హైపర్ స్కేల్ డేటాసెంటర్ను (60 మెగావాట్ల సామర్థ్యంతో) ఏర్పాటు చేయనుంది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్.. హైదరాబాద్లో ఏర్పాటు అవ్వనుంది. తన అనుబంధ సంస్థ నెక్స్ట్రా ద్వారా భారతీ ఎయిర్టెల్ ఈ డేటాసెంటర్ను నెలకొల్పుతుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలీయన్లో.. మంత్రి కేటీఆర్తో భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్లలో సమావేశం అయిన తర్వాత ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది.
Dialysis: కిడ్నీ రోగుల్లో డయాలసిస్ భయాలు.. అసలు వాస్తవాలు ఇవే..
Also Read
- Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
- Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఎయిర్టెల్-నెక్స్ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉంది. దేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ ఒక హబ్ మారింది. ఎయిర్టెల్ తాజా పెట్టుబడితో మేము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నా. ఎయిర్టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్టెల్-నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. “హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్టులలో ఒకటి. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఇతర రంగాల్లోనూ మా ఉనికి, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు.
C Kalyan: ఆ ఇద్దరిని బహిష్కరిస్తున్నాం.. నిర్మాత కళ్యాణ్ బాంబ్
#TriumphantTelangana bags major investment – Bharti Airtel Group @airtelindia to set up large Hyperscale Data Centre in Hyderabad with ₹2000 Cr.
The announcement came after the Group's Founder & Chairman Sunil Bharti Mittal, VC Rajan Bharti Mittal met Minister @KTRTRS at #wef23 pic.twitter.com/9PVErOR2K8
— KTR, Former Minister (@MinisterKTR) January 18, 2023
తాజావార్తలు
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..