Minister KTR: తెలంగాణకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి
Airtel Nxtra To Build Hyper Scale Data Centre In Hyderabad: తెలంగాణకు మంత్రి కేటీఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తీసుకొచ్చారు. రూ. 2 వేల కోట్లతో భారతీ ఎయిర్టెల్ గ్రూప్ రాష్ట్రంలో హైపర్ స్కేల్ డేటాసెంటర్ను (60 మెగావాట్ల సామర్థ్యంతో) ఏర్పాటు చేయనుంది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్.. హైదరాబాద్లో ఏర్పాటు అవ్వనుంది. తన అనుబంధ సంస్థ నెక్స్ట్రా ద్వారా భారతీ ఎయిర్టెల్ ఈ డేటాసెంటర్ను నెలకొల్పుతుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలీయన్లో.. మంత్రి కేటీఆర్తో భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్లలో సమావేశం అయిన తర్వాత ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది.
Dialysis: కిడ్నీ రోగుల్లో డయాలసిస్ భయాలు.. అసలు వాస్తవాలు ఇవే..
Also Read
- Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఎయిర్టెల్-నెక్స్ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉంది. దేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ ఒక హబ్ మారింది. ఎయిర్టెల్ తాజా పెట్టుబడితో మేము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నా. ఎయిర్టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్టెల్-నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. “హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్టులలో ఒకటి. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఇతర రంగాల్లోనూ మా ఉనికి, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు.
C Kalyan: ఆ ఇద్దరిని బహిష్కరిస్తున్నాం.. నిర్మాత కళ్యాణ్ బాంబ్
#TriumphantTelangana bags major investment – Bharti Airtel Group @airtelindia to set up large Hyperscale Data Centre in Hyderabad with ₹2000 Cr.
The announcement came after the Group's Founder & Chairman Sunil Bharti Mittal, VC Rajan Bharti Mittal met Minister @KTRTRS at #wef23 pic.twitter.com/9PVErOR2K8
— KTR, Former Minister (@MinisterKTR) January 18, 2023
తాజావార్తలు
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!