Minister KTR: తెలంగాణకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Nxtra To Build Hyper Scale Data Centre In Hyderabad: తెలంగాణకు మంత్రి కేటీఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తీసుకొచ్చారు. రూ. 2 వేల కోట్లతో భారతీ ఎయిర్టెల్ గ్రూప్ రాష్ట్రంలో హైపర్ స్కేల్ డేటాసెంటర్ను (60 మెగావాట్ల సామర్థ్యంతో) ఏర్పాటు చేయనుంది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్.. హైదరాబాద్లో ఏర్పాటు అవ్వనుంది. తన అనుబంధ సంస్థ నెక్స్ట్రా ద్వారా భారతీ ఎయిర్టెల్ ఈ డేటాసెంటర్ను నెలకొల్పుతుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలీయన్లో.. మంత్రి కేటీఆర్తో భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్లలో సమావేశం అయిన తర్వాత ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది.
Dialysis: కిడ్నీ రోగుల్లో డయాలసిస్ భయాలు.. అసలు వాస్తవాలు ఇవే..
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఎయిర్టెల్-నెక్స్ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉంది. దేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ ఒక హబ్ మారింది. ఎయిర్టెల్ తాజా పెట్టుబడితో మేము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నా. ఎయిర్టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్టెల్-నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. “హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్టులలో ఒకటి. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఇతర రంగాల్లోనూ మా ఉనికి, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు.
C Kalyan: ఆ ఇద్దరిని బహిష్కరిస్తున్నాం.. నిర్మాత కళ్యాణ్ బాంబ్
#TriumphantTelangana bags major investment – Bharti Airtel Group @airtelindia to set up large Hyperscale Data Centre in Hyderabad with ₹2000 Cr.
The announcement came after the Group's Founder & Chairman Sunil Bharti Mittal, VC Rajan Bharti Mittal met Minister @KTRTRS at #wef23 pic.twitter.com/9PVErOR2K8
— KTR, Former Minister (@MinisterKTR) January 18, 2023
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!