Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ నెలలో మైక్రోసాఫ్ట్ 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకు ముందు ఆగస్టులోనూ కొందరిని విధుల నుంచి తప్పించింది. తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
Read Also: Assembly Election 2023: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల తేదీలు ఖరారు..
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భనం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ కంపెనీల లాభాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో పలు సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అన్ని టెక్ కంపెనీలు కూడా తమ వర్క్ ఫోర్స్ లో 5-10 శాతం మందిని తీసేయాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది తొలివారంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థల్లో కలిపి దాదాపుగా 30,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇదిలా ఉంటే ద్రవ్యోల్భనం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లో కూడా ఆర్థిక మాంద్యం ముందస్తు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఖచ్చితంగా ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన మెటా, ట్విట్టర్ వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగింపు ప్రారంభించాయి. మెటా తన ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. ఇదే విధంగా ట్విట్టర్ కూడా తన ఉద్యోగుల్లో 50 శాతం అంటే 3700 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దేశీయ టెక్ సంస్థ షేర్ చాట్ కూడా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగిస్తోంది. రానున్న కాలంలో ఇండియాలోని టెక్ సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!