Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ నెలలో మైక్రోసాఫ్ట్ 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకు ముందు ఆగస్టులోనూ కొందరిని విధుల నుంచి తప్పించింది. తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
Read Also: Assembly Election 2023: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల తేదీలు ఖరారు..
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భనం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ కంపెనీల లాభాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో పలు సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అన్ని టెక్ కంపెనీలు కూడా తమ వర్క్ ఫోర్స్ లో 5-10 శాతం మందిని తీసేయాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది తొలివారంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థల్లో కలిపి దాదాపుగా 30,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇదిలా ఉంటే ద్రవ్యోల్భనం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లో కూడా ఆర్థిక మాంద్యం ముందస్తు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఖచ్చితంగా ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన మెటా, ట్విట్టర్ వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగింపు ప్రారంభించాయి. మెటా తన ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. ఇదే విధంగా ట్విట్టర్ కూడా తన ఉద్యోగుల్లో 50 శాతం అంటే 3700 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దేశీయ టెక్ సంస్థ షేర్ చాట్ కూడా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగిస్తోంది. రానున్న కాలంలో ఇండియాలోని టెక్ సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!