Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ నెలలో మైక్రోసాఫ్ట్ 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకు ముందు ఆగస్టులోనూ కొందరిని విధుల నుంచి తప్పించింది. తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
Read Also: Assembly Election 2023: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల తేదీలు ఖరారు..
Also Read
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భనం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ కంపెనీల లాభాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో పలు సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అన్ని టెక్ కంపెనీలు కూడా తమ వర్క్ ఫోర్స్ లో 5-10 శాతం మందిని తీసేయాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది తొలివారంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థల్లో కలిపి దాదాపుగా 30,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇదిలా ఉంటే ద్రవ్యోల్భనం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లో కూడా ఆర్థిక మాంద్యం ముందస్తు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఖచ్చితంగా ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన మెటా, ట్విట్టర్ వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగింపు ప్రారంభించాయి. మెటా తన ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. ఇదే విధంగా ట్విట్టర్ కూడా తన ఉద్యోగుల్లో 50 శాతం అంటే 3700 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దేశీయ టెక్ సంస్థ షేర్ చాట్ కూడా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగిస్తోంది. రానున్న కాలంలో ఇండియాలోని టెక్ సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!