Secretariat Dharma Case: చనిపోయి, బతికిన ధర్మా.. ట్విస్టులు రివీల్ చేసిన ఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak SP Rohini Priyadarshini Reveals Secretariat Employee Dharma Case Details: తన చావుపై డబ్బులు సంపాదించాలనుకున్నాడు, కోట్లకు పడగలెత్తాలని కలలు కన్నాడు, అందుకు తగినట్టుగానే స్కెచ్ వేశాడు కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇది తెలంగాణ సచివాలయ ఉద్యోగి ధర్మా కేసు. తొలుత అతని ప్లాన్ సక్సెస్ అయ్యింది కానీ, ఆ తర్వాత బెడిసికొట్టింది. ఈ కేసుని విచారించిన పోలీసులు, చాకచాక్యంగా వ్యవహరించి ధర్మాతో పాటు అతనికి సహకరించిన నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు వెల్లడించారు. ఆమె మాటల్లోనే..
‘‘జనవరి 9న వెంకటాపుర్లో కారు దగ్ధం అయ్యిందని సమాచారం వచ్చింది. అందులో చనిపోయిన వ్యక్తి ధర్మా అని కుటుంబ సభ్యులు చెప్పారు. మేము కూడా ధర్మనే అనుకున్నాం. కానీ, విచారణ సమయంలో ధర్మా బతికి ఉన్నాడని తెలిసింది. దీంతో ఇంకా లోతుగా దర్యాప్తు చేశాం. నిజామాబాద్లో ధర్మా బయట తిరుగుతున్న విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. 2018లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకొని, షేర్ మార్కెట్లో ధర్మ పెట్టుబడులు పెట్టాడు. మొదట్లో చాలా లాభం వచ్చింది. ఆ తర్వాత కరోనా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల షేర్ మార్కెట్ పడిపోయి నష్టాలొచ్చాయి. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సంవత్సరం నుంచి చాలా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. తన పేరు మీదున్న రూ. 7.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడాడు. ధర్మ అక్క సునంద, అల్లుడు శ్రీనివాస్, భార్య నీల, కొడుకు మైనర్ మొత్తం కలిసి ఈ స్కెచ్ వేశారు. కేసులో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం’’ అని ఎస్పీ రోహిణి చెప్పారు.
Also Read
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ఇంకా మాట్లాడుతూ.. ‘‘మొదట దర్మలాగా ఉన్న వ్యక్తి కోసం నాంపల్లి పొలీస్ స్టేషన్ వద్ద వెతికారు. అక్కడ అంజయ్య అనే వ్యక్తితో ధర్మ పరిచయం చేసుకున్నాడు. నిజామాబాద్లో పని ఉందని జనవరి 7న తీసుకెళ్లాడు. అతడ్ని ఎలాగైనా చంపాలనుకున్నారు కానీ.. అంజయ్య తాగి ఉండటంతో వదిలేశారు. అప్పటికప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బాబు అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అతనికి బాసరలో గుండు గీయించి, ధర్మ బట్టలు వేశారు. అదే కారులో వెంకటాపూర్కి తీసుకొచ్చారు. చెరువు దగ్గరికి రాగానే, అతడ్ని కారు ముందుకు రమ్మన్నారు. అతడు సహకరించకపోవడంతో.. గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాబు చనిపోవడంతో.. అతని మృతదేహాన్ని కారు ముందు పెట్టి, కాలువలోకి తోసేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు’’ అని కేసు వివరాల్ని ఎస్పీ రోహిణి వెల్లడించారు. నిందితులపై 302, 364, 120B, 201, 202, 212 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
తాజావార్తలు
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!