BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్, గాంధీ చౌక్, లేబర్ అడ్డ ఏరియాలలో మార్నింగ్ వాకింగ్లో భాగంగా ప్రజలతో ముచ్చటిస్తూ బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక రైతు బజార్ లో కూరగాయలు అమ్ముతున్న రైతులతో మహిళలతో మాట్లాడుతూవారితో కరచాలనం చేస్తూ వినోద్ అన్నకు ఓటేయాలని కేటీఆర్ అభ్యర్థించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం ప్రచారం చేశారు.
Read also: Aravind Kejriwal : ఆప్ ప్రచార గీతాన్ని ఆమోదించిన ఎన్నికల సంఘం
Also Read
అనంతరం స్థానిక సిరిసిల్ల రైతు బజార్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న వారు కొన్ని సూచనలు చేశారు. త్రాగు నీరు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిర్లు వేయాలని కోరారు. 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశించారు. చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అప్పుడు నీళ్లు కరెంటు సక్రమంగా వచ్చేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తరువాత, వాగులో నీళ్లు పోయాయని తర్వాత నెల కూడా పెన్షన్ రావడం లేదని వారు బాధను వ్యక్తం చేశారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకోలేదని, రుణమాఫీ చేయలేదనీ రైతు బంధు రాలేదని అంటున్నారని తెలిపారు.. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ వాటికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారని అన్నారు.
CM Revanth Reddy: నేడు 4 లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
తాజావార్తలు
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!