KCR : ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వమా..?
- అభివృద్ధి, సంక్షేమం స్తంభించిందన్న కేసీఆర్
- పాత పథకాలను ఆపేశారని విమర్శ
- సాగునీటి హక్కులపై ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణ
- ఎన్నికల ఫలితాలే ప్రజావ్యతిరేకతకు నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం “సడి లేదు సప్పుడు లేదు” అన్న చందంగా తయారయ్యాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రజల కోసం తీసుకురాలేదని, పైగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేసిందని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు వంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ, ప్రజలకు అందుతున్న ఫలాలను దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా రైతులు మళ్లీ యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడే దుస్థితికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలో ఢిల్లీ స్థాయిలో పోరాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, దీనిపై బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదని, ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ వ్యతిరేకత ఇప్పటికే ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
KCR: చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే RDX బాంబులు పెట్టి పేల్చిండు
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!