KCR: చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే RDX బాంబులు పెట్టి పేల్చిండు
- పాలమూరుపై ఉమ్మడి పాలకుల ఘోర వివక్ష
- దత్తత పేరుతో అభివృద్ధి మోసం
- ఆర్డీఎస్ కాలువను పేల్చేశారన్న ఆరోపణ
- వలసల గోసకు ముగింపు తెచ్చిందే తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు జిల్లా పట్ల పాలకులు ప్రదర్శించిన వివక్షను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎండగట్టారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు ఉన్నా నీరు లేక పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు గొప్పలు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యమని కేసీఆర్ విమర్శించారు. “సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి” అనేది కేవలం ఒక స్లోగన్గా మాత్రమే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. జూరాల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన కర్ణాటక ప్రాంతానికి చెల్లించాల్సిన కేవలం 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని, తాను బహిరంగ సభల్లో తీవ్రంగా ప్రశ్నించిన తర్వాతే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తుచేశారు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) విషయంలో జరిగిన ద్రోహాన్ని కేసీఆర్ వివరించారు. 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ కాలువను బాంబులు పెట్టి పేల్చివేసి, తెలంగాణ రైతులకు అందాల్సిన నీటిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని లోకానికి చాటి చెప్పడానికే తాను జోగులాంబ నుండి గద్వాల వరకు మొదటి పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో జూరాల – ఆర్డీఎస్ లింక్ కెనాల్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని, కానీ రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు.
జిల్లా మొత్తం 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ, భయంకరమైన కరువును అనుభవించాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఈ దుర్భర పరిస్థితిని చూసే గోరేటి వెంకన్న వంటి కవులు “పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన” వంటి గుండెలు పిండే పాటలు రాశారని చెప్పారు. ఈ పరిస్థితుల వల్లే ప్రజలు పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని, ఉమ్మడి పాలకులు కావాలనే ఈ ప్రాంతాన్ని వెనకకు నెట్టివేశారని తాను వందల ఉపన్యాసాల్లో చెప్పిన మాటలు ఈ రోజు అక్షర సత్యాలుగా నిరూపితమయ్యాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఈ వివక్షకు ముగింపు పడిందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!