KCR: చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే RDX బాంబులు పెట్టి పేల్చిండు
- పాలమూరుపై ఉమ్మడి పాలకుల ఘోర వివక్ష
- దత్తత పేరుతో అభివృద్ధి మోసం
- ఆర్డీఎస్ కాలువను పేల్చేశారన్న ఆరోపణ
- వలసల గోసకు ముగింపు తెచ్చిందే తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు జిల్లా పట్ల పాలకులు ప్రదర్శించిన వివక్షను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎండగట్టారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు ఉన్నా నీరు లేక పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు గొప్పలు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యమని కేసీఆర్ విమర్శించారు. “సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి” అనేది కేవలం ఒక స్లోగన్గా మాత్రమే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. జూరాల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన కర్ణాటక ప్రాంతానికి చెల్లించాల్సిన కేవలం 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని, తాను బహిరంగ సభల్లో తీవ్రంగా ప్రశ్నించిన తర్వాతే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తుచేశారు.
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) విషయంలో జరిగిన ద్రోహాన్ని కేసీఆర్ వివరించారు. 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ కాలువను బాంబులు పెట్టి పేల్చివేసి, తెలంగాణ రైతులకు అందాల్సిన నీటిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని లోకానికి చాటి చెప్పడానికే తాను జోగులాంబ నుండి గద్వాల వరకు మొదటి పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో జూరాల – ఆర్డీఎస్ లింక్ కెనాల్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని, కానీ రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు.
జిల్లా మొత్తం 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ, భయంకరమైన కరువును అనుభవించాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఈ దుర్భర పరిస్థితిని చూసే గోరేటి వెంకన్న వంటి కవులు “పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన” వంటి గుండెలు పిండే పాటలు రాశారని చెప్పారు. ఈ పరిస్థితుల వల్లే ప్రజలు పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని, ఉమ్మడి పాలకులు కావాలనే ఈ ప్రాంతాన్ని వెనకకు నెట్టివేశారని తాను వందల ఉపన్యాసాల్లో చెప్పిన మాటలు ఈ రోజు అక్షర సత్యాలుగా నిరూపితమయ్యాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఈ వివక్షకు ముగింపు పడిందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!