MLC Jeevan Reddy : రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టడంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు ప్రప్రంచంలో ఎవరు లేరు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, నిధులు ఖర్చు చేయకుండ రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ ను ఆసరాగా చేసుకొని దళితులను దగా చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ఎస్సీ, రూ.30, వేల, ఎస్టీ రూ.20 వేల కోట్లు నిధులు ఖర్చు చేయకుండా.. ఖజానాలో మూలుగుతున్నాయి. ప్రభుత్వానికి చిత్త శుద్ది లేక నిధులు ఖర్చు చేయలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Asaduddin Owaisi: మోడీ కాదు ఆయనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి.. అలా అయితేనే వస్తాం..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమి పథకం కనుమరుగైంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కళ్యాణ లక్ష్మీ నిధులు కూడా ఎస్సీ నిధుల నుంచి వెచ్చిస్తున్నారు.. రు.30 వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రము లో ఇళ్లు లేని దళితులు ఉండరు. ఇప్పటికైనా దళిత బంధు ఇవ్వడం సంతోషమే.. 2021-2022 ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 100 దళిత బంధు ఇస్తామన్నారు.. 2022-23 లో దళిత బంధు పథకం కింద నియోజక వర్గంలో 1500 మందికి బడ్జెట్ లో రూ.17700 కోట్లు కేటాయించినా ఒక్కరికీ కూడా ఇవ్వలేదు అని ఆయన గుర్తు చేశారు.
Also Read : Andhra Pradesh Crime: వీడిని ఏమనాలి..? లేగదూడలే టార్గెట్.. రాత్రివేళ లైంగిక దాడి..!
ఉమ్మడి రాష్ట్రంలో అర్హత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఎత్తేశారు.. స్వంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే రూ.3 లక్షలు ఇస్తామన్నారు.. ఇంత వరకు దళిత బంధు అమలుకు మార్గదర్శకాలు లేవు.. నవంబర్ లో ఎన్నికలు రావొచ్చు అని సీఎం కేసీఆర్ చెప్పారు.. జూలైలో ఇళ్లు మంజూరు ప్రక్రియనే పూర్తి కాదు.. నిర్మాణాలు ఎలా పూర్తి చేస్తారు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ మీ చేతిలో లేనప్పుడు ఇస్తామని ఎందుకు చెప్పారు అంటూ కాంగ్రెస్ ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి అడిగారు.
తాజావార్తలు
-
Peddi : ఇదెక్కడి ట్విస్ట్.. ఇప్పట్లో ఆగేలా లేదు?
-
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
-
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?