Asaduddin Owaisi: మోడీ కాదు ఆయనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి.. అలా అయితేనే వస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగపదవిలో ఉన్న, భారతదేశ ప్రథమ పౌరురాలు అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆమెను ఆహ్వానించకుండా రాష్ట్రపతిని అవమానిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ వంటి 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి రాబోమని ప్రకటించాయి.
Read Also: Congress : ఎల్లుండి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం..
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ఇదిలా ఉంటే ఈ అంశంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొత్త భవనాన్ని ప్రధాని మోడీ కాదని, పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించాలని ఆయన అన్నారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలనే వాదనతో తాను ఏకీభవించడం లేదని ఓవైసీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం అవసరమని, దాన్ని ఎవరూ కాదనలేరని, ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ప్రతిపక్షాలు తనను సంప్రదించలేదని, అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని వారు చెబుతున్నది రాజ్యాంగం ప్రకారం సరికాదని, స్పీకర్ లోక్ సభ సంరక్షకుడు అని, కొత్త పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభించాలని, ప్రధాని మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గాలని ఓవైసీ అన్నారు. అలా అయితేనే ఈ వేడుకలకు హాజరవుతాం అని ఓవైసీ బుధవారం అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది వరకు సౌకర్యవంతంగా కూర్చునేలా నిర్మించారు. ఉభయసభల్లో మొత్తంగా 1280 మంది సభ్యులు కూర్చునేందుకు అనువుగా భవనాన్ని నిర్మించారు. ప్రధాని మోడీ దీనికి డిసెంబర్ 2020లో శంకుస్థాపన చేశారు. మే 28న ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!