Speaker Gaddam Prasad Kumar: గత ప్రభుత్వం కాగితం మాత్రమే ఇచ్చింది.. డబ్బులు ఇవ్వలేదు..!
- గత ప్రభుత్వం కాగితం మాత్రమే ఇచ్చింది..
- డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించిన తెలంగాణ స్పీకర్..
- వికారాబాద్ జిల్లా అభివృద్దికి కృషి చేస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Gaddam Prasad Kumar: గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవనం కోసం ఆర్డర్ కాగితం మాత్రమే ఇచ్చిందని నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని జీవో చేశారు తప్పా.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
Read Also: Hero Nani : ‘కల్కి’లో ఆ పాత్రలో కనిపించబోతున్న నాని…?
Also Read
- Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
- Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ఇక, జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి చొరవతో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులను ఒప్పించి వారికి ఇవ్వాల్సిన డబ్బులను జనరల్ ఫండ్ కింద తీసుకొని ఐదు కోట్ల రూపాయలతో జడ్పీ భవన నిర్మాణం చేశారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వ నాయకులు కూడా డబ్బు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పుడు ఆ బాధ్యత తనపై వేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల సహకారంతో ఇతరత్రా పనులన్నీ కూడా 6 నుంచి 8 నెలల లోపు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం తర్వాత పట్టణంలోని ట్రాన్స్ జెండర్స్ కి స్పీకర్ సర్టిఫికెట్ పంపిణీ చేశారు.
Read Also: Lok sabha: ఎమర్జెన్సీపై 2 నిమిషాల మౌనం.. విపక్షాల ఆందోళన.. వాయిదా
అలాగే, ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ సీఈవో సుధీర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..