KC Venugopal: రేవంత్ ఈ విషయంలో ఎందుకు వెనుకపడ్డావు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పబ్లిసిటీ చెయ్యడంలో ముందుంటావు… కానీ, భారత్ జోడో యాత్రలో ఎందుకు వెనుక పడ్డావు అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్. భారత్ జోడో యాత్రపై గాంధీభవన్లో జరిగిన సమీక్షలో ఈ కామెంట్స్ చేశారు కేసీ వేణుగోపాల్. జోడో ప్రచారంలో తెలంగాణ పీసీసీ వెనుకబడిందని కామెంట్ చేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసే వరకు తెలంగాణ విడిచిపోవద్దని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను ఆదేశించారు. తమకున్న నివేదిక ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న వేణుగోపాల్, భారత్ జోడో యాత్రను పాదయాత్రలా కాకుండా ఉద్యమంలా చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీతో సాయంత్రం జరిగే పాదయాత్రలో 50 వేలమందికి తక్కువ ఉండకుండా చూడాలని చెప్పారు. భారత్ జోడోకు విస్తృతమైన ప్రచారం చెయ్యాలన్నారు. రేపటి నుంచే గ్రామస్థాయికి వెళ్లేలా ప్రచారాన్ని మొదలుపెట్టాలని చెప్పారు కేసీ వేణుగోపాల్.
Read Also: Minister Seediri Appalaraju: పాదయాత్ర ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటాం
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
ఇక, పాదయాత్రలో రాహుల్ గాంధీని కలిసేందుకు నాయకులు ఎవరూ ప్రయత్నం చేయొద్దు అని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్.. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసేవాళ్లను, ఉద్యమకారులను, సమస్యలతో బాధపడుతున్న వాళ్లను రాహుల్ గాంధీని కలిసేలా ప్లాన్ చేసుకోండి అని సూచించారు.. కాగా, కర్నాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఇందులో పార్టీ నేతలు డీకే శివకుమార్తో పాటు స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడక్కడ ఆగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నడక సాగిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్. ఉదయం బొమ్మనగండన హళ్లి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర.. సాయంత్రం రాంపురాలో ముగిసింది. ఉదయం అక్కడి నుంచే మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!