Kavitha : కొత్త పార్టీ పేరు అప్పుడే ప్రకటిస్తా.. ఆరోజే బలమైన ముహుర్తం ఉంది..
- రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలి
- సర్వోదయ తెలంగాణ సాధన కోసమే కొత్త పార్టీ రావాలి
- తెలంగాణ సాధించి పన్నెండేళ్లు దాటింది
- నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయాం
- ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ప్రజలు ఆలోచించాలి
- - కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటినా, అమరవీరుల ఆశయాలైన నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాకారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసం కాకుండా, ‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ఒక కొత్త శక్తి ఉద్భవించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు.
నిజామాబాద్ వేదికగా మాట్లాడిన కవిత, తనకూ ఈ ప్రాంతానికీ ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నేను నిజామాబాద్ కోడలిని, తెలంగాణ బిడ్డను. ఈ మట్టికి ఉన్న శక్తి అపారమైనది. నిజామాబాద్ గడ్డ నుంచి తీసుకునే ప్రతి ఆలోచన, చేసే ప్రతి నిర్ణయం ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, గత 20 రోజులుగా మార్క్ఫెడ్ను ఎందుకు తెరవడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని, దీనివల్ల సామాన్య రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని ఆరోపించారు. ప్రజలు ప్రస్తుతం తాము ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలని, ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 25వ తేదీన ఒక బలమైన ముహూర్తం ఉందని, ఆ రోజున మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో భారీ బహిరంగ సభ ద్వారా తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేస్తూ, ప్రజల పక్షాన నిలబడే ఒక శక్తివంతమైన వేదికగా ఈ పార్టీ రూపుదిద్దుకోబోతోందని ఆమె పేర్కొన్నారు.
Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్మ్యాన్ను చూసి అందరూ షాక్
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..