Kavitha : అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?
- బతుకమ్మపై ప్రభుత్వానికి నైతిక అర్హత లేదన్న కవిత
- సింగరేణి లాభాల్లో కార్మికులకు అన్యాయం చేశారని విమర్శ
- శ్రీరాంపూర్లో మైన్లు మూసివేతపై ఆవేదన వ్యక్తం
- కొత్త గనులు ప్రారంభించాలని డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ వర్షం వచ్చినప్పటికైనా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు కవిత స్వాగతం తెలియజేసారు.. శ్రీరాంపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్ జాఫర్ ఎక్స్ప్రెస్లో భారీ పేలుడు.. పట్టాలు తప్పి బోల్తాపడిన బోగీలు..!
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
కవిత మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమ సమయంలో మనం బతుకమ్మ ఎత్తుకొని ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశాం. బతుకమ్మ, బోనాల ద్వారా ఉద్యమం గాథల్ని ఉర్రూతలూగించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది.” “వందల ఏళ్లుగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగను ఈ ప్రభుత్వం విభజించుకుని అందరి నుంచి దూరం చేసింది. అలాంటి వారిచే నిర్వహించబడే బతుకమ్మ కార్యక్రమాలకు మనం ఎలా వెళ్లాలి? అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?”
“ఇది సింగరేణి గడ్డ. ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒక కార్మికుడు ఉండేవారు. ఆ కార్మికులకు కాంగ్రెస్ చుట్టుముట్టిన విధంగా వాటా ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం 60 శాతం లాభాలను పక్కన పెట్టింది. మిగతా లాభాల నుంచి బోనస్ ఇవ్వడం గొప్ప పనిలా ప్రచారం చేస్తున్నారు. వారి నిర్వాక నిర్ణయాల వల్ల ప్రతి కార్మికుడి కుటుంబం లక్ష రూపాయల వరకు నష్టపోయింది.” శ్రీరాంపూర్లో రెండు మైన్స్ ఇప్పటికే బంద్ అయ్యాయని, మరొకటి కూడా మూసివేతకు ఒత్తిడిలో ఉందని కవిత తెలిపారు. కొత్త గనులను ప్రారంభించాలని, ఉన్న గనుల కార్యకలాపాలను నిలిపివేయకూడదని ఆమె ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి సహా కార్మికాలకు తగునట్లుగా ప్రభుత్వం షేర్స్ లేదా వాటా కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
Chattisgarh : నారాయణపూర్ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు కట్ట రామచంద్ర రెడ్డి హతం
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!