Kavita New Party : కవిత కొత్త పార్టీ: తెలంగాణ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా?
- నిజామాబాద్లో కొత్త పార్టీ ప్రకటనకు కవిత సిద్ధం
- ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా రాజకీయాల్లో కొత్త అడుగు
- బోధన్ నుంచి పోటీపై చర్చలు జోరుగా
- మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా కొత్త పార్టీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నిజామాబాద్ (ఇందూరు) వేదికగానే ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించే అధికారిక సమావేశంలో “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో కొత్త పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల తేదీని కూడా అదే వేదిక నుంచి వెల్లడించేందుకు సర్వం సిద్ధమైంది.
India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్లు..!
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
రాబోయే నెలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా, అజెండా , పార్టీ గుర్తును (సింబల్) ప్రజల ముందుకు తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. ఈ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం పార్టీ ప్రకటనకే పరిమితం కాకుండా, కవిత రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండటంతో, అదే పార్లమెంట్ పరిధిలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..
కవిత ఈ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వంటి నేతలు కవిత నిర్ణయంతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కవిత వెంట ఎంతమంది కీలక నేతలు నడుస్తారు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆమె పార్టీలో చేరతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో వస్తున్న ఈ కొత్త పార్టీ, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!