Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?
- మైనింగ్ కుంభకోణంపై ప్రభుత్వాన్ని నిలదీసిన కౌశిక్ రెడ్డి
- హౌస్ కమిటీ ఎందుకు వేయరని ప్రశ్నల వర్షం
- ఎథిక్స్ కమిటీపై ఆగ్రహం.. వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందన
- సిఐడి నోటీసులు, పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ కుంభకోణం , అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాయి. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనింగ్ స్కామ్ నుండి తన వ్యక్తిగత పర్సనాలిటీ వరకు ప్రతి అంశంపై ఆయన క్లారిటీ ఇస్తూనే, అధికార పార్టీ తీరును తప్పుబట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కుంభకోణంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా అన్ని విషయాలను బయటపెట్టారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. “నిజంగా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంటే హరీష్ రావు అడిగినట్లు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని, ఆ కారణం చేతనే ఈ స్కామ్పై విచారణకు ప్రభుత్వం వెనకాడుతోందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్
తనపై ఎథిక్స్ కమిటీ వేయడంపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే దానం నాగేందర్ వాడిన భాష ఎథిక్స్ కమిటీ పరిధిలోకి రాదా అని నిలదీశారు. తన వ్యక్తిగత పర్సనాలిటీపై చేసిన కామెంట్లకు బదులిస్తూ.. “నేను స్పోర్ట్స్ పర్సన్ని. అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో దేశంలోనే ఫిట్టెస్ట్ ప్లేయర్గా ఉన్నాను. 20 ఏళ్ల కష్టం ఈ బాడీ. నా పర్సనాలిటీ మీద ఏడిస్తే ఎలా?” అంటూ ఘాటుగా స్పందించారు. ఎథిక్స్ కమిటీ ముందు అన్ని విషయాలను ధైర్యంగా చెబుతానని వెల్లడించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా కౌశిక్ రెడ్డి విమర్శలు సంధించారు. “కడియం శ్రీహరి గారు.. కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశారు? అసలు మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో అసెంబ్లీలో స్పష్టం చేయమని అడిగితే తప్పేంటి?” అని ప్రశ్నించారు. కడియం వ్యవహారశైలిపై అసెంబ్లీలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదని ఆయన పేర్కొన్నారు.
హుజురాబాద్లోని డంపింగ్ యార్డ్ ఏర్పాటును అడ్డుకోవడానికి తాను ఈ నెల 4న చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి సిఐడి నోటీసులు ఇచ్చారని కౌశిక్ రెడ్డి తెలిపారు. “కరీంనగర్ సీపీ మీద వేయాల్సిన సిఐడి ఎంక్వైరీ నా మీద వేశారు. 4వ తేదీన విచారణకు పిలిస్తే వెళ్తాను, కానీ 5 లేదా 6వ తేదీల్లో డంపింగ్ యార్డును అడ్డుకుని తీరుతాను” అని ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులపై మండిపడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడి విచారణలు పోలీసుల మెడకే చుట్టుకుంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!