PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్
- తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ
- కూలీలతో ముచ్చటిస్తూ ఆకులు కోసిన ప్రధాని
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి మరీ తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
- BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అస్సాంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరుగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీ అస్సాం పర్యటనకు వచ్చారు. బుధవారం ఉదయం దిబ్రూగఢ్లోని తేయాకు తోటలకు వెళ్లారు. అక్కడ పని చేస్తున్న మహిళా కూలీలతో కలిసి తేయాకు ఆకులు కోశారు. వారితో ముచ్చటిస్తూ పని చేస్తూ కనిపించారు. అలాగే వారి సంస్కృతిని తెలుసుకుని సెల్ఫీ తీసుకున్నారు. అయితే దేశ ప్రధాని తమతో కలిసి పని చేయడంతో మహిళా కూలీలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. తేయాకు అస్సాం ఆత్మ అని.. ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించుకుందని మోడీ రాసుకొచ్చారు. ‘‘ఈ ఉదయం దిబ్రుగఢ్లో నేను ఒక టీ తోటను సందర్శించి.. అక్కడ పనిచేస్తున్న మహిళలతో మాట్లాడాను. అది నాకు ఎంతో గుర్తుండిపోయే అనుభవం.’’ అని మోడీ పేర్కొన్నారు.

‘‘తేయాకు కోసిన తర్వాత మహిళలు నాతో వారి సంస్కృతి గురించి మాట్లాడుతూ.. సెల్ఫీ కూడా తీసుకున్నారు. తేయాకు తోటల కుటుంబాలందరి కృషికి మేము చాలా గర్వపడుతున్నాం. వారి కఠోర శ్రమ, అంకితభావం అస్సాం కీర్తిని మరింత పెంచాయి.’’ అని మోడీ రాసుకొచ్చారు.

ఏప్రిల్ 9వ తేదీన అస్సాంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది.







We are very proud of the efforts of each and every tea garden family. Their hardwork and perseverance have enhanced Assam’s pride.
Here are some more glimpses from a tea garden in Dibrugarh. pic.twitter.com/L7je3s8JnO
— Narendra Modi (@narendramodi) April 1, 2026
Tea is the soul of Assam! The tea from here has made its way across the world.
This morning in Dibrugarh, I went to a tea garden and interacted with women working here. It was a very memorable experience. pic.twitter.com/2VZufAAZ0h
— Narendra Modi (@narendramodi) April 1, 2026
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!