Rangareddy Crime: షాద్ నగర్ లో కిడ్నాప్.. గచ్చిబౌలిలో హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karunakar Reddy, who was kidnapped in Kothur, was brutally murdered: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో కిడ్నాప్ కు గురైన కరుణాకర్ రెడ్డి కథ విషాదాంతంగా ముంగిసింది. ఇవాళ ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. చేగూర్ సమీపంలో కరుణాకర్ రెడ్డి కారును అడ్డగించి అద్దాలు పగలగొట్టి అతని పై దాడి చేశారు. అడ్డగించిన వ్యక్తి పై దాడి చేసి కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ చేశారు. సిక్రేట్ ప్లేస్ కు తీసుకొని వెళ్లిన దుండగులు. కరుణాకర్ ను విచక్షణారహితంగా దుండగులు చితకబాదారు. ముఖంపై పిడు గుద్దులు గుద్ది రెండు చేతులు, కాళ్లు దుండగులు విరగగొట్టారు. దీంతో కరుణాకర్ రెడ్డి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కరుణాకర్ రెడ్డి కదలకపోవడంతో దుండగులు నిన్న రాత్రి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
కరుణాకర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు కరుణాకర్ రెడ్డి అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో ఆసుపత్రి నుండి దుండగులు పరారయ్యారు. కరుణాకర్ రెడ్డిని తీసుకుని ఐదు మంది ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. ఆసుప్రతి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన అక్కడకు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. కరుణాకర్ రెడ్డి మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈవిషయమై కరుణాకర్ రెడ్డి కుటుంబానికి తెలియజేశారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కరుణాకర్ రెడ్డి స్వస్థలం మల్లాపూర్ గ్రామంలో భారీగా పోలీసుల మోహరించారు.
Also Read
Read also: KTR Twitter: ట్విటర్ లో కేటీఆర్ను ప్రశ్నించిన నెటిజన్.. స్మూత్ గా బదులిచ్చిన మంత్రి
కరుణాకర్ రెడ్డి చనిపోయిన వార్త వినగానే కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. నిన్న కిడ్నాప్ గురయ్యారని ఫిర్యాదు చేసామని ఇవాల కరుణాకర్ రెడ్డి చనిపోయాడని పోలీసులు ఫోన్ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి బామ్మర్దులు పాత కక్షలు నేపథ్యంలో కిడ్నాప్ చేసినట్లు కిడ్నాప్ చేసి కరుణాకర్ రెడ్డి ని చంపేసారని తల్లి స్వరూప వాపోయింది. తనకు న్యాయం చేయాలని కరుణాకర్ రెడ్డిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఓ భూమి విషయంలో గ్రామ పెద్ద మద్య పంచాయితీ కొనసాగుతుంది. కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో MPP మదుసూదన్ రెడ్డి జీర్ణించుకోలేక పోయాడు. పంచాయతి అయిపోయి నప్పటి నుండి 15 మంది తో మదుసూదన్ రెడ్డి మనుషులు రెక్కీ నిర్వహించారు. చివరికి చేగూర్ సమీపంలో అటాక్ చేసి, కారులో కిడ్నాప్ చేశారు. కరుణాకర్ రెడ్డి చచ్చిపోయేంత వరకు కొట్టి ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి తీసుకుని వచ్చిన చనిపోయాడని తెలియగానే అక్కడి నుంచి పరార్ అయ్యారు.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!