Karimnagar: నేడే కోడిపుంజు వేలం.. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం..!
Karimnagar: కరీంనగర్ లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. వరంగల్ నుండి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో పుంజు లభ్యమైంది. కరీంనగర్ బస్టాండుకు వచ్చిన తరువాత బస్సులో ఓ సంచిలో కోడిపుంజు గుర్తించిన డ్రైవర్. సంచీలో కోడిపుంజు ఉండటంతో కంట్రోలర్ కు అప్పగించారు. గత 4 రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును ఉంచి అధికారులు సంరక్షిస్తున్నారు. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఇవాల మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో ఆశక్తి కరంగా మారింది. ఆర్టీసీ అధికారులు కోడి పుంజు వేలం పాటలో పుంజును ఎవరు దక్కించుకోనున్నారనేది ఉత్కంఠంగా మారనుంది. ఈ వేలంలో పుంజు ఎవరు దర్కించుకోనున్నారనేది చూడాలంటే మధ్యహ్నం 3 వరకు వేచిచూడాల్సిందే.
Read also: PM Kisan Tractor Yojana: రైతుల కోసం.. ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన’ ఇందులో నిజమెంత ?
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు
- Karimnagar: కరీంనగర్ RBL బ్యాంకులో 138 కోట్ల మోసం బట్టబయలు.. వెలుగులోకి కీలక విషయాలు..
- Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!
పుంజు కథ ఇది..
గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు. ఆ కోడి సుమారు 6 కిలోల వరకు ఉంటుందని ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు. అయితే కోడిపుంజు కోసం దానికి సంబంధించిన తాలుకు ఎవరైనా వస్తారని గత నాలుగు రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును బంధించారు. కాగా.. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజు బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో కరీంనగర్ -2 డిపో పరిధిలో బహిరంగ వేలం నిర్వహించబడును. కావున ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొనగలరని తెలిపారు. అయితే.. ఇప్పుడు కోడిపుంజు వేలంకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
CM Revanth Reddy: నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ..!
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!