Karimnagar: నేడే కోడిపుంజు వేలం.. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. వరంగల్ నుండి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో పుంజు లభ్యమైంది. కరీంనగర్ బస్టాండుకు వచ్చిన తరువాత బస్సులో ఓ సంచిలో కోడిపుంజు గుర్తించిన డ్రైవర్. సంచీలో కోడిపుంజు ఉండటంతో కంట్రోలర్ కు అప్పగించారు. గత 4 రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును ఉంచి అధికారులు సంరక్షిస్తున్నారు. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఇవాల మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో ఆశక్తి కరంగా మారింది. ఆర్టీసీ అధికారులు కోడి పుంజు వేలం పాటలో పుంజును ఎవరు దక్కించుకోనున్నారనేది ఉత్కంఠంగా మారనుంది. ఈ వేలంలో పుంజు ఎవరు దర్కించుకోనున్నారనేది చూడాలంటే మధ్యహ్నం 3 వరకు వేచిచూడాల్సిందే.
Read also: PM Kisan Tractor Yojana: రైతుల కోసం.. ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన’ ఇందులో నిజమెంత ?
Also Read
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
పుంజు కథ ఇది..
గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు. ఆ కోడి సుమారు 6 కిలోల వరకు ఉంటుందని ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు. అయితే కోడిపుంజు కోసం దానికి సంబంధించిన తాలుకు ఎవరైనా వస్తారని గత నాలుగు రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును బంధించారు. కాగా.. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజు బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో కరీంనగర్ -2 డిపో పరిధిలో బహిరంగ వేలం నిర్వహించబడును. కావున ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొనగలరని తెలిపారు. అయితే.. ఇప్పుడు కోడిపుంజు వేలంకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
CM Revanth Reddy: నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ..!
తాజావార్తలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
-
Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!