కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి మైదానంలోకి వచ్చిన ఈ పెద్దపులి కారణంగా సమీప మండలాల్లో అలజడి నెలకొంది. భిక్కనూరు మండలం, పెద్దమల్లారెడ్డి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు ధృవీకరించారు. దీనితో పాటు, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పెద్దపులి తన ఉనికిని చాటుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు లేగదూడలపై దాడి చేసి వాటిని చంపేసింది. పశువుల మందలపై వరుసగా దాడులు జరుగుతుండటంతో, పశువుల కాపరులు తమ పశువుల భద్రతపై భయపడుతున్నారు. ప్రమాదాన్ని అంచనా వేసిన అటవీ అధికారులు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. పెద్దపులిని ట్రాక్ చేసి అడవిలోకి పంపించేందుకు ఆసిఫాబాద్ నుంచి నలుగురు సభ్యులున్న ఒక ప్రత్యేక బృందాన్ని కామారెడ్డికి రప్పించారు. ఈ బృందం ప్రస్తుతం పెద్దపులి ఆచూకీ తెలుసుకుని దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!