Kamareddy Cyber Fraud: ఆన్లైన్ కాల్ లో కేటుగాళ్ళ ఎంట్రీ.. లక్ష మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy Cyber Fraud: సైబర్ నేరగాళ్లు మితిమీరుతున్నారు. అధికారులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పాసా మాయం చేయడంలో వారి సాటి లేదంటున్నారు. స్కామ్ చేయడంలో పైసలు మాయం చేయడంలో మామూలుగా ప్లాన్ వేయడం లేదు. వారి వలలో చిక్కడమే ఆలస్యం డబ్బులు అకౌంట్ లో వేసుకునేందుకు ఖచ్చినమైన ప్లాన్ లతో వేచి చూస్తున్నారు. ఎదుటి వారిని ప్లాన్ ప్రకారం కాల్ రావడమే ఆలస్యం అకౌంట్ లో డబ్బులు ఖాలీ చేయడంలో ఆరితేరిపోతున్నారు. దీంతో ఈ సమస్య పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలకు అధికారులకు సవాల్ గా మారింది. సైబర్ నేరగాళ్ల చేతిలో అమాయకులు అభాసుపాలవుతున్నారు. మోసపోయి కన్నీరు పెట్టుకుంటున్నారు. సైబర్కేటుగాళ్లు మా అకౌంట్ ఖాళీ చేసారంటూ పోలీస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. న్యాయం కోసం పోలీసులకు ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
Read also: jewellery Theft: ఇంట్లో పెళ్లి సందడి.. బంగారంతో కి‘లేడీ’ పరార్
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైబర్ మోసం సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లాలో శ్రీనివాస్ అనే యువకుడు ఆన్ లైన్ లో క్లాసుల కోసం అడ్మిసన్ తీసుకున్నాడు. మళ్లీ అతను ఎందుకు ఆన్ లైన్ క్లాసులు వద్దనుకున్నాడు. దీంతో శ్రీనివాస్ అడ్మిషన్ రద్దు చేసుకోవడానికి ఆన్ లైన్ లో కాల్ సెంటర్ కు కాల్ చేశాడు. అయితే మాట్లాడుతుండగానే మొబైల్ నంబర్ కు లింక్ లు పంపించారు సైబర్ నేరగాళ్లు అది గమనించని శ్రీనివాస్ లింకును క్లిక్ చేశాడు. అంతేకాకుండా దానికి యూపీఐ నంబర్ ను సైబర్ కేటుగాళ్లకు చేరవేశాడు. అంతే శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ నుంచి క్షణాల్లో 95,000 వేల నగదు మాయమైంది. అకౌంట్ నుంచి 95,000 వేలు నగదు డెబిట్ అయినట్లుగా మెసేజ్ రావడంతో శ్రీనివాస్ కు దిమ్మతిరిగింది. ఏంచేయాలో అర్థకాలేదు. ఆందోళనకు గురైన శ్రీనివాస్ కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు నుంచి చెబుతున్నా ప్రజలు వినడం లేదని, ఫోన్లకు మెసేజ్ లు వచ్చిన క్లిక్ చేయకండని చెబుతున్నారు. మీ ఏటీఎం పిన్ నెంబర్, యూపీఐ నెంబర్ లు తెలియని వ్యక్తికి పంపకండని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడి నుంచి పొంచి ఉంటారో చెప్పలేమని ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
HayatNagar Rave Party: ప్రీ ప్లాన్ గా రేవ్ పార్టీ.. పాల్గొన్న మూడు కాలేజ్ ల బీటెక్ విద్యార్థులు
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!