బర్ నేరగాళ్ల బెదిరింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారు. మోసం చేయడంలో తప్పు లేదన్నట్లుగా సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైబర్ మోసం సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లాలో శ్రీనివాస్ అనే యువకుడు ఆన్ లైన్ లో క్లాసుల కోసం అడ్మిసన్ తీసుకున్నాడు. మళ్లీ అతను ఎందుకు ఆన్ లైన్ క్లాసులు వద్దనుకున్నాడు. దీంతో శ్రీనివాస్ అడ్మిషన్ రద్దు చేసుకోవడానికి ఆన్ లైన్ లో కాల్ సెంటర్ కు కాల్ చేశాడు. అంతే శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ నుంచి క్షణాల్లో 95,000 వేల నగదు మాయమైంది.