Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ గ్లోబల్ ప్రాపగాండా చేస్తోంది
- కాళేశ్వరంపై గ్లోబల్ ప్రాపగాండా చేస్తున్న బీఆర్ఎస్: ఉత్తమ్
- బ్యారేజీల డ్యామేజ్తో పంపింగ్ అసాధ్యమన్న మంత్రి
- NDSA నివేదికను విస్మరిస్తున్నారని విమర్శ
- కాగ్ నివేదికతో గత ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విపక్షాలు పూర్తిగా అసత్య ప్రచారం చేస్తూ, గ్లోబల్ ప్రాపగాండాకు తెరలేపాయని మండిపడ్డారు. పదేళ్ల పాటు సాగిన గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా సర్వనాశనం చేశారని, వారు ఏది ముట్టినా అది నాశనమైపోయిందని ఆరోపించారు. గత పాలకులు కేవలం తమ కక్కుర్తి కోసమే ప్రాజెక్టులను కట్టారు తప్ప, రైతుల ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ మీద రూ. 1 లక్షా 81 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, అందులో కాళేశ్వరం తప్ప సాధించిందేమీ లేదని, ఒక్క ఎకరా నిలకడైన నీళ్లు ఇవ్వని కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులే నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
బ్యారేజీల డ్యామేజ్ వల్లే పంపింగ్ అసాధ్యం
కన్నెపల్లి పంప్హౌస్ను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల వైఖరిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. గత పాలకులు పదేళ్ల పాటు ప్రాజెక్టును సక్రమంగా కట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వారి చారిత్రాత్మక తప్పిదాల వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు నేడు ఉపయోగంలో లేకుండా పోయాయని స్పష్టం చేశారు. ఆ బ్యారేజీలలో కనీస స్థాయిలో కూడా నీటిని నిల్వ చేయడానికి వీల్లేదని ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ (NDSA) స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. బ్యారేజీల ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉందని, వాటిని వాడొద్దని నిపుణులు నిర్ధారించారన్నారు. ఒకవేళ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే, ఎగువన భారీ ముంపు ఏర్పడి 44 గ్రామాలతో పాటు భద్రాచలం గుడి కూడా మునిగిపోతుందని కేంద్ర అధికారులు హెచ్చరించారని వెల్లడించారు.
Also Read
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
టెక్నికల్ సమస్యలను వివరిస్తూ ఘాటు విమర్శలు
ప్రస్తుతం గోదావరిలో నీళ్లు లేవని, వస్తున్న ప్రవాహమంతా ప్రాణహిత నది నుంచే వస్తోందని మంత్రి వివరించారు. ఈ తరుణంలో కన్నెపల్లి పంప్హౌస్ ఆన్ చేయాలని మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత నీళ్ల కోసం కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే.. ఆ నీరంతా అన్నారం బ్యారేజీకి వెళ్తుందని, కానీ అన్నారం బ్యారేజీ ఇప్పటికే తీవ్రంగా డ్యామేజ్ అయి ఉందని పేర్కొన్నారు. అక్కడి నుండి నీళ్లు సుందిల్లకు వెళ్లాలని, కానీ ఆ రెండు బ్యారేజీలూ దెబ్బతిని ఉన్నప్పుడు నీటిని ఎలా నింపుతామని ప్రశ్నించారు. అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఉపయోగంలో లేనప్పుడు కన్నెపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎటు వెళ్లాలో సమాధానం చెప్పాలన్నారు. “మీరు ప్రాజెక్టు సరిగ్గా కట్టి ఉంటే, మేము ఎప్పుడో కన్నెపల్లి పంపు ఆన్ చేసేవాళ్లం.. అసలు సమస్యకు కారణమే మీరు” అని దుయ్యబట్టారు.
కాగ్ నివేదిక.. లీకేజీలపై నిర్లక్ష్యం
కాళేశ్వరం ప్రాజెక్టు గనుక పూర్తి స్థాయిలో పనిచేస్తే, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఎంత విద్యుత్ అవసరమో, ఒక్క ఈ ప్రాజెక్టుకే అంత పవర్ అవసరమవుతుందని ‘కాగ్’ (CAG) నివేదికలోనే స్పష్టమైందని మంత్రి గుర్తుచేశారు. మూడు బ్యారేజీలు కట్టినప్పటి నుండి లీకేజీలు, సివేజ్ సమస్యలు ఉన్నప్పటికీ అప్పటి పెద్దమనుషులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు నివేదికలు పంపినప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డలో బలవంతంగా నీటి నిల్వను కొనసాగించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ (NDSA) బృందం వచ్చి సమీక్ష చేసిందని, టెక్నికల్ అథారిటీ చెప్పిన నివేదికలను కూడా తప్పు పడుతున్న విపక్షాల మూర్ఖపు మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!