C. R. Patil : కాళేశ్వరంపై రాజ్యసభలో రచ్చ.. కేంద్ర జల శక్తి మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- కాళేశ్వరం పై కేంద్రం ఫైర్
- డిజైన్ లోపాలే కారణమని వ్యాఖ్య
- లక్ష కోట్లపై తీవ్ర విమర్శలు
- సీబీఐ విచారణకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే ప్రధాన కారణమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాలేశ్వరం నిర్మాణం, అందులో జరిగిన అవినీతి , సాంకేతిక లోపాలపై కేంద్రం ఘాటుగా స్పందించింది.
Donald Trump: ఇరాన్కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే..
Also Read
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
- Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి నీళ్లలో పోశారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులోని లోపాలను కేంద్ర బృందం నిశితంగా అధ్యయనం చేస్తోందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు, బీఆర్ఎస్ ఎంపీ కే.ఆర్. సురేష్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం, ప్రాజెక్టులోని లోపాలు , నిర్మాణ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు సంధించింది.
మరోవైపు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. నిధులను నిర్దేశించిన పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడంపై కేంద్రం సీరియస్ అయింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?