C. R. Patil : కాళేశ్వరంపై రాజ్యసభలో రచ్చ.. కేంద్ర జల శక్తి మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- కాళేశ్వరం పై కేంద్రం ఫైర్
- డిజైన్ లోపాలే కారణమని వ్యాఖ్య
- లక్ష కోట్లపై తీవ్ర విమర్శలు
- సీబీఐ విచారణకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే ప్రధాన కారణమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాలేశ్వరం నిర్మాణం, అందులో జరిగిన అవినీతి , సాంకేతిక లోపాలపై కేంద్రం ఘాటుగా స్పందించింది.
Donald Trump: ఇరాన్కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే..
Also Read
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి నీళ్లలో పోశారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులోని లోపాలను కేంద్ర బృందం నిశితంగా అధ్యయనం చేస్తోందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు, బీఆర్ఎస్ ఎంపీ కే.ఆర్. సురేష్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం, ప్రాజెక్టులోని లోపాలు , నిర్మాణ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు సంధించింది.
మరోవైపు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. నిధులను నిర్దేశించిన పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడంపై కేంద్రం సీరియస్ అయింది.
తాజావార్తలు
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
-
August 2026 Horoscope: ఆగస్టులో ఈ 4 రాశులకు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం.. ఆకస్మిక ధనలాభాలు?
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!