Shepherd Donates Land: ఊరి దాహం తీర్చేందుకు గొర్రెల కాపరి భూరి విరాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shepherd Donates Land: భూమి కోసం గొడవలు తీవ్రరూపం దాల్చి వివాదాల్లో అమూల్యమైన ప్రాణాలు పోతున్న ఈ కాలంలో ఓ గొర్రెల కాపరి గ్రామం దాహం తీర్చేందుకు తన భూమిని విరాళంగా ఇచ్చాడు. అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేనీ ఈ రోజుల్లో ఇతని దానం ఎంతో మందిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. మధ్యప్రదేశ్లోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న దిండోరి జిల్లాలో ఓ గొర్రెల కాపరి గ్రామంలోని దీర్ఘకాల దాహార్తిని తీర్చడానికి తన భూమిని దానం చేశాడు.
57ఏళ్ల వయస్సు గల గొర్రెల కాపరి తెంకు ప్రసాద్ బన్వాసి తన మూడెకరాల స్థలంలో 1,000 చదరపు అడుగుల స్థలాన్ని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (PHE) విభాగం ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ను నిర్మించడానికి విరాళంగా ఇచ్చాడు. దిండోరి జిల్లాలోని షాపురా బ్లాక్లోని బార్గావ్ గ్రామంలోని 4,500 మంది నివాసితుల నీటి కష్టాలు తీర్చడానికి స్వతహాగా ముందుకొచ్చి ఈ భూరి విరాళాన్ని అందించాడు. అతడిని దీని గురించి అడగగా.. గొప్పగా మాట్లాడాడు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
“నేను గ్రామంలోని గ్రామస్థుల పశువులను పచ్చిక బయళ్లకు మేత కోసం తీసుకెళ్తే వచ్చే జీతంతో జీవిస్తా. కుటుంబ పోషణ కోసం నాకున్న కొద్దిపాటి భూమిలో పంట పండించి కుటుంబాన్ని పోషించుకుంటాను. దీనికి ఆ భూమి ఉపయోగపడుతుంది. కానీ గ్రామస్థుల దీర్ఘకాల నీటి కష్టాల ముందు నా కుటుంబ సమస్య చిన్నగా అనిపించింది. వాటర్ ట్యాంక్ వల్ల నీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోయేలా నేను భూమిలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చాను.” అని గొర్రెల కాపరి వెల్లడించారు. గ్రామంలో నీటి సంబంధిత సమస్యలు త్వరగా తీరేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు గిరిజన గొర్రెల కాపరి ఆదివారం తెలిపారు.
PM Narendra Modi: వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ను ప్రారంభించిన ప్రధాని మోడీ
గొర్రెల కాపరి భూ విరాళంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఆ గొర్రెల కాపరిని అభినందిస్తూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. “నల్ జల్ యోజన కోసం 1,000 చదరపు అడుగుల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా తెంకు బన్వాసి గొప్ప పనిచేశారు. ఈ గొప్ప ప్రయత్నానికి నేను అతనికి నమస్కరిస్తున్నాను.” అని ముఖ్యమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. బార్గావ్ గ్రామం చాలా కాలంగా నీటి లభ్యత లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది.
ముఖ్యంగా వేసవి కాలంలో, గ్రామంలోని రెండు ప్రాంతాలైన బన్వాసి మొహల్లా, శంకర్ తోలా నుంచి మహిళలు, పిల్లలు సల్గి నది నుండి నీటిని తీసుకురావడానికి 2.3 కి.మీ వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను గమనించిన బన్వాసి తన గొప్ప మనస్సుతో ట్యాంక్ నిర్మాణం కోసం భూమిని దానం చేశారు. ఇది తెలిసిన పలువురు ఆయన గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.
जल ही जीवन है और प्यासे को पानी पिलाने वाले को अपार पुण्य प्राप्त होता है।
डिंडोरी के ठेंकू वनवासी ने 'नल जल योजना' के लिए पानी की टंकी के निर्माण हेतु अपनी 5 हजार स्क्वेयर फीट भूमि दान करने का वंदनीय कार्य किया है।
मैं उनके इस पुनीत कार्य के लिए हृदय से अभिनंदन करता हूं। https://t.co/cIrRyyPble
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 10, 2022
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!