Kadiyam Srihari: నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజం.. కడియం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadiyam Srihari: నమ్మించి మోసాగించడం కేసీఆర్ నైజమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిన కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని వరంగల్ కి వచ్చారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంభం పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. భూ కబ్జాలు ఆరోపణలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు నెలల తరువాత బీఆర్ఎస్ మూత పడబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక్క సిటు కూడా బీఆర్ఎస్ గెలవడం లేదన్నారు. బీఆర్ఎస్ ఓటింగ్ శాతం 20 శాతానికి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయిందన్నారు. బీజేపీ కంటే బీఆర్ఎస్ వెనకపడిందన్నారు. కవిత పైనా బీజేపీ వాళ్ళు కుట్రతో కేసులు పెట్టారు అని కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దేశంలో ఒక్క కవితనే ఉందా? తప్పు లేనిదే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. నీ బిడ్డా లిక్కర్ కేసులో ఉన్నందుకు కేసీఆర్ సిగ్గు పడాలన్నారు. కవిత వల్ల కేజ్రీవాల్ నష్టపోయారని తెలిపారు. నీ బిడ్డ వళ్ళ కేసుల్లో కేజ్రీవాల్ ఇరుక్కున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
Read also: Hemant Soren : హేమంత్ సోరెన్కు షాక్.. విచారణ మే 6కు వాయిదా
రాజయ్య మీద ప్రేమ ఉంటే వరంగల్ పార్లమెంట్స్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎదురుగా ఒక మాట మాట్లాడుతారు.. లోపల మరొక్క తీరు మాట్లాడే నైజం కేసీఆర్ ది అంటూ మండిపడ్డారు. వరంగల్ కి కేసీఆర్ చేసింది ఏంటి? అని ప్రశ్నించారు. వరంగల్ కి కనీసం మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయమని చెప్పిన అప్రవల్ అవ్వలేదన్నారు. వరంగల్ అంటే కేసీఆర్ కి కోపం వరంగల్ జిల్లా అంటే కేసీఆర్ కి ప్రేమ లేదని తెలిపారు.
ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎక్కవ మంది కాబట్టి ఆయనకు వరంగల్ అంటే భయం అన్నారు. సీఎం సంభందం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారా? అని నిప్పులు చెరిగారు. నమ్మించి మోసాగించడం కేసీఆర్ నైజం అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ కుటుంభంనికీ వేలాది ఎకరాల భూము ఎలా వచ్చాయ్నన్నారు. అరూరి రమేష్ కి వరంగల్ చుట్టూ వందలాది ఎకరాల భూమి ఎలా వచ్చింది అన్నారు. కబ్జా చేయడంతోనే భూములు వస్తాయన్నారు.
Minister Seetakka: మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను..
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..