K. A. Paul: ప్రధాని మోడీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి.. పదవికి రాజీనామా చేసి ప్రైమ్ మినిస్టర్ గా అమిత్ షాకి అవకాశం ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని నరేంద్ర మోడీ అమ్మేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఓటమి పాలు అయ్యింది.. అన్ని చోట్ల కాంగ్రెస్ పతనం అయ్యింది.. మరో 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాదు అంటూ కేఏ పాల్ అన్నాడు.
Also Read: Adipurush: రాముడి కోసం తిరుపతికే అయోధ్య…
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
కర్ణాటకలో మా మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ లో పదిమంది ముఖ్యమంత్రులు బయలుదేరారు అంటూ పాల్ విమర్శించారు. జై సీఎం అంటున్నారు.. హుజూరాబాద్ లో మూడు వేల ఓట్లు కూడా పడలేదు.. పొంగులేటి పార్టీలు మారాడు.. వైసీపీ, బీఆర్ఎస్ లకు వెళ్లి వచ్చాడు.. మీరు పార్టీ పెట్టడం వల్ల ఒక్క సీటు గెలవరు అంటూ ఆయన వ్యాఖ్యనించాడు.
Also Read: Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడించిన రైల్వే మంత్రి
కర్ణాటకలో లక్ష కోట్లు ఉన్న గాలి జనార్థన్ రెడ్డి కుడా అక్కడ సక్సెస్ కాలేదు అని కేఏ పాల్ గుర్తు చేశారు. రెడ్లు అందరూ బీసీ, ఎస్సీలకు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలన్న కోరిక ఉంది అన్నారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. ఆరునెలలు మాత్రమే తెలంగాణ సీఎంగా ఉంటాను అంటూ కామెంట్స్ చేశాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఎలా అభివృద్ధి చేయగలరు అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.
Also Read: Srikantachari’s mother: యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో శ్రీకాంత చారి తల్లికి సన్మానం
పొంగులేటి ప్రజాశాంతి పార్టీలో చేరితే నేను సీఎంగా.. మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారు అంటూ కేఏ పాల్ అన్నాడు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పెద్ద డ్రామా అంటూ కామెంట్స్ చేశాడు. నిన్నటి వరకు నా మిత్రుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఇప్పుడు జగన్ ను ఓడించేందుకు బాబు కుట్రలో భాగమే ఈ భేటీ అని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు.. బాబుకి 25 సార్లు గురువును.. ఆయన తల మీద 22 సార్లు అశీర్వదించాను అంటూ పాల్ వ్యాఖ్యనించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ జాగ్రత్తగా ఉండాలి.. వారికి ప్రమాదం పొంచి ఉంది అని కేఏ పాల్ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!