KA Paul: నేను అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ, ఏపీల్లో తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలను కాదని తానే అధికారంలోకి వస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే బడుగులు, బలహీర వర్గాలు, నిరుద్యోగులు, రైతులకు అండగా నిలుస్తానని వాగ్ధానాలు చేస్తున్నారు. తనకు ఉన్న పరిచయాలు, పలుకుబడితో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తెస్తానని హామీలు ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
Read Also: Harish Rao: తెలంగాణ 2వ స్థానంలో.. గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో..
Also Read
- Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
- Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
- Ponnam Prabhakar: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత పోరాట విజయం
- NIMS Hyderabad : నిమ్స్లో వైద్య రంగానికి మైలురాయి.. 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. తాను తెలంగాణలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంతో పాటు వరద బాధితులకు సహాయం చేస్తా అని అన్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన ఉండబోతోందని వెల్లడించారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ లో తెలుగు ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని తెలిపారు. విభజన హామీలు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు కోట్ల వరద బాధితులు ఉన్నారని.. అయితే ఆదుకునే నాయకుడు మాత్రం లేదని విమర్శించారు. తెలుగు ప్రజలు నిరుత్సాహ పడొద్దని.. తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేందుకు అందరితో కలిసి పోరాటం చేస్తా అని వెల్లడించారు. త్వరలో భారత్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుందని తెలిపారు. హైదారాబాద్, అహ్మదాబాద్ లో సదస్సు ఉంటుందని కేఏ పాల్ వెల్లడించారు. ప్రపంచ దేశాల అధ్యక్షులు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల ఆర్థిక సదస్సుకు హజరు అవుతారని.. వెల్లడించారు. ఎకనామిక్ సమ్మిట్ తో 8 లక్షల కోట్ల పెట్టుబడులు దేశానికి రానున్నాయని అన్నారు. ఏపీ, తెలంగాణకు నాలుగు లక్షల కోట్లు, గుజరాత్ కి నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అన్నారు.
తాజావార్తలు
-
Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
-
Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
-
Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
-
Delhi: ఢిల్లీ వాసులకు శుభవార్త.. తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!