K. Keshava Rao : గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్ లో చర్చ జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ఏడాదికి ముందు.. అత్యంత కీలకమైన బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు రానుంది. ఇందుకోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. జనవరి 31న ప్రారంభమవుతాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే.. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్షాలు సమావేశమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్లో బీఆర్ఎస్న ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సూచనలు చేశారు. అయితే.. తాజాగా బీఆర్ఎస్ పార్లమెంటరిపార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కొరాల్సి వస్తుంది …ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదన్నారు. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. ఢిల్లీ, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు.
Also Read : Viswa Karthikeya: ‘ఎన్త్ అవర్’ మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
అంతేకాకుండా.. సమాఖ్య వ్యవస్థ,ఫెడరలిజం గురించి చర్చ జరగాలన్నారు. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదని, గవర్నర్ ప్రసంగం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదని, నిరుద్యోగం అంశంపైనా చర్చ జరగలని కోరామన్నారు. దేశ సమస్యలపై చర్చ జరపాలని కోరామని, కేవలం బిల్లుల ఆమోదం కాదు.. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని కోరామన్నారు. గవర్నర్ వ్యవస్థ పై చర్చ జరపాలని కోరామని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు లెవనెత్తుతామని ఆయన పేర్కొన్నారు.
Also Read : T+1 Settlement Cycle: ఒక్క రోజులోనే మన ఖాతాలోకి డబ్బులు లేదా సెక్యూరిటీలు
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!