K. Keshava Rao : గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్ లో చర్చ జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ఏడాదికి ముందు.. అత్యంత కీలకమైన బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు రానుంది. ఇందుకోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. జనవరి 31న ప్రారంభమవుతాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే.. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్షాలు సమావేశమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్లో బీఆర్ఎస్న ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సూచనలు చేశారు. అయితే.. తాజాగా బీఆర్ఎస్ పార్లమెంటరిపార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కొరాల్సి వస్తుంది …ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదన్నారు. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. ఢిల్లీ, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు.
Also Read : Viswa Karthikeya: ‘ఎన్త్ అవర్’ మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
అంతేకాకుండా.. సమాఖ్య వ్యవస్థ,ఫెడరలిజం గురించి చర్చ జరగాలన్నారు. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదని, గవర్నర్ ప్రసంగం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదని, నిరుద్యోగం అంశంపైనా చర్చ జరగలని కోరామన్నారు. దేశ సమస్యలపై చర్చ జరపాలని కోరామని, కేవలం బిల్లుల ఆమోదం కాదు.. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని కోరామన్నారు. గవర్నర్ వ్యవస్థ పై చర్చ జరపాలని కోరామని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు లెవనెత్తుతామని ఆయన పేర్కొన్నారు.
Also Read : T+1 Settlement Cycle: ఒక్క రోజులోనే మన ఖాతాలోకి డబ్బులు లేదా సెక్యూరిటీలు
తాజావార్తలు
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!