K. Keshava Rao : గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్ లో చర్చ జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ఏడాదికి ముందు.. అత్యంత కీలకమైన బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు రానుంది. ఇందుకోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. జనవరి 31న ప్రారంభమవుతాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే.. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్షాలు సమావేశమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్లో బీఆర్ఎస్న ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సూచనలు చేశారు. అయితే.. తాజాగా బీఆర్ఎస్ పార్లమెంటరిపార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కొరాల్సి వస్తుంది …ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదన్నారు. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. ఢిల్లీ, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు.
Also Read : Viswa Karthikeya: ‘ఎన్త్ అవర్’ మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
అంతేకాకుండా.. సమాఖ్య వ్యవస్థ,ఫెడరలిజం గురించి చర్చ జరగాలన్నారు. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదని, గవర్నర్ ప్రసంగం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదని, నిరుద్యోగం అంశంపైనా చర్చ జరగలని కోరామన్నారు. దేశ సమస్యలపై చర్చ జరపాలని కోరామని, కేవలం బిల్లుల ఆమోదం కాదు.. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని కోరామన్నారు. గవర్నర్ వ్యవస్థ పై చర్చ జరపాలని కోరామని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు లెవనెత్తుతామని ఆయన పేర్కొన్నారు.
Also Read : T+1 Settlement Cycle: ఒక్క రోజులోనే మన ఖాతాలోకి డబ్బులు లేదా సెక్యూరిటీలు
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!