Jupally Krishna Rao : ప్రజలను మోసం చేసే దుర్మార్గ పాలన కొనసాగుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల్లోకి చేరికలు, రాజీనామాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్లోకి చేరికలు పెరిగాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ పెంచింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం ఖాయైమంది. అయితే.. నేడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన భేటీలో వీరిద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
Also Read : EPFO: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తేదీ పొడిగింపు..!
Also Read
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసే దుర్మార్గ పాలన కొనసాగుతోందన్నారు. ప్రజాస్వామ్యం పాతాళానికి, అవినీతి ఆకాశం ఎత్తుకు పోయుందని ఆయన మండిపడ్డారు. బోగస్ మాటలు, అబద్దాలు, వృధా ఖర్చు తప్పితే కేసిఆర్ చేసింది ఏమీ లేదని, ఓ ఫాసిస్ట్ లా, కేసిఆర్ నిరంకుశ ధోరణి తో వ్యవహరిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘మరోసారి అధికారానికి ఎట్టిపరిస్థితుల్లోనూ కేసిఆర్ రాకూడదు. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఈసారైనా ప్రజలు అలా చేయకపోతే దేవుడు కూడా క్షమించదు. నైతికంగా కేసిఆర్ అర్హత కోల్పోయారు. రెండు చేతులు జోడించి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకోవాల్సి ఉంది.’ అని ఆయన అన్నారు.
Also Read : Aishwarya Sarja: స్టార్ హీరో కూతురుతో కమెడియన్ కొడుకు పెళ్లి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!