Medigadda Dam: నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Project: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్టు పేరు ఎత్తడానికే బీఆర్ఎస్ వెనకబడిపోయింది. అలా తమకు కలిసొస్తుంది అనుకున్న ప్రాజెక్టే, తమ కొంపముంచింది అని గూలాబీ పార్టీ భావించే పరిస్థితి ఏర్పాడింది. ఈ అగ్గిని అధికార కాంగ్రెస్ మరింత రాజేస్తోంది. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను దగ్గరుండి చూసేందుకు ఇవాళ మంత్రుల బృందం అక్కడికి పోతుంది.
Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు..అదే దారిలో వెండి .. ఎంతంటే?
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
అయితే, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ డ్యామ్ 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూస్తారు. ఈ పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తారు. అలాగే, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇందు కోసం నీటి పారుదల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Weather Update Today: ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు.. 11 రాష్ట్రాలకు వర్షసూచన
కాగా, ఈ ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడం వెనక బీఆర్ఎస్ అవినీతి కారణం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇంజినీరింగ్ వైఫల్యంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వెల్లడించింది. కేంద్రం జల వనరుల సంస్థ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారనే వాదన కొనసాగుతుంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు శ్రీకారం చూట్టారు. దీనికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు.. కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని మార్పులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలని లెక్కలోకి తీసుకొని, డిజైన్ మార్చడం వల్ల వ్యయం పెరగడంతో పాటూ, టెక్నికల్ గానూ లోపాలు ఏర్పడ్డాయనే వాదన కాంగ్రెస్ తెర పైకి తీసుకొస్తుంది. అందుకు తగ్గట్టుగానే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగిపోవడంతో విమర్శలకు మరింత బలం పెరిగింది.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!