Kaleshwaram: కంపులో కాళేశ్వరం గోదావరి తీరం.. దుర్గంధంతో భక్తులు ఇబ్బందులు..
- పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం కంపు..
- దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం కంపు కొడుతుంది. వ్యర్థాలు,భక్తుల దుస్తులు,కుండలతో దర్శనమిస్తూ దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కావడంతో కాళేశ్వరానికి తెలంగాణ, ఏపి, మహరాష్ట్ర చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండే ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించెందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయాన్ని దర్శించేముందు త్రివేణి సంగమమైన గోదావరి నదిలో పుణ్యస్నానాలు అచరించడం ఆనవాయితి. దీంతో పున్యస్నానాలకు వెళ్ళే భక్తులకు గోదావరి తీరంలో దుర్గంధం స్వాగతం పలుకుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read also: D.K Aruna: కాలేజీ అమ్మాయిల స్కూటీ లు ఎటు పాయే.. సీఎం రేవంత్ ట్వీట్ పై డీకే అరుణ ఫైర్..
Also Read
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
- Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
త్రివేణి సంగమం తీరం వద్ద కొందరు తిండి పదార్థాలు, వ్యర్థాలు, దుస్తులు, చెత్త, అస్థికల కుండలు, వేసి కలుషితం చేస్తున్నారు. ప్లాస్టిక్ నియంత్రణ లేకపోవడంతో గోదావరి నది కంపుకొడుతుంది. దీంతో భక్తులు పుణ్యస్నానాలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటివల రాష్ట్ర దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ కాళేశ్వరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గోదావరి తీరం అపరిశుభ్రంగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ చూపి నిత్యం తీరం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే సూచనలను పెడదారి పెట్టాయి. శుభ్రం చేసే నాధుడు కరువయ్యాడు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు, ఆలయ అధికారులు స్పందించి గోదావరి తీరంలో వ్యర్ధాలను తొలగించి, పరిశుభ్రంగా ఉంచాలాని పలువురు భక్తులు కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోదావరి వద్ద దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
V.C. Sajjanar: క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్ ఘటన.. సజ్జనార్ ట్వీట్ తో పది మందిపై కేసు..
తాజావార్తలు
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
-
IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!