Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం కలెక్టర్ కాళ్లు పట్టుకున్న రైతు
- నెల రోజులుగా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్
- విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ఎండిన పొలం
- కలెక్టర్ తనిఖీ వేళ రైతు ఆవేదన
- తక్షణ చర్యలకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon : జనగామ జిల్లాలో ఒక సామాన్య రైతు పడుతున్న కష్టాలు, అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. తన పొలం ఎండిపోతుంటే తట్టుకోలేక, ఒక రైతు ఏకంగా జిల్లా కలెక్టర్ కాళ్లు మొక్కి తన సమస్యను పరిష్కరించాలని వేడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోని ఒక గ్రోమోర్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న యూరియా రికార్డులను , నిల్వలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్రగొల్ల పహాడ్ గ్రామానికి చెందిన అజ్మీరా రవి అనే రైతు కలెక్టర్ దగ్గరకు చేరుకున్నారు. తన గోడును అధికారులకు వినిపించే క్రమంలో ఒక్కసారిగా తీవ్ర ఆవేదనకు లోనై, కలెక్టర్ కాళ్లు పట్టుకుని రోదించారు.
Also Read
- Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
- CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
- CM Revanth Reddy: ఉద్యోగుల జీతాలపై రేవంత్ కీలక నిర్ణయం.. ఏజెన్సీలకు వార్నింగ్
- Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
రైతు అజ్మీరా రవి తన పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నెల రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, సాగునీరు అందక చేతికందాల్సిన పంట కళ్లముందే ఎండిపోతోందని కలెక్టర్ వద్ద వాపోయారు. “మా సమస్యను మీరే పరిష్కరించాలి” అంటూ ఆయన కలెక్టర్ కాళ్లు పట్టుకుని వేడుకోవడం అక్కడున్న వారందరినీ చలింపజేసింది. రైతు పడుతున్న కష్టాన్ని చూసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తక్షణమే స్పందించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, ఆ రైతు పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారుల పనితీరుపై చర్చకు దారితీసింది. క్షేత్రస్థాయిలో రైతులు తమ చిన్న సమస్యల కోసం కూడా ఉన్నతాధికారుల కాళ్లు మొక్కడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
New Year 2026: “న్యూ ఇయర్” ఏ దేశంలో ముందు, ఏ దేశంలో చివరగా వస్తుందో తెలుసా..
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
-
CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
-
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!