Jana Reddy : శంకుస్థాపనలతోనే గొప్పలు.. పనులు మాత్రం నిల్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి… నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ సుమారుగా 60 సంవత్సరాలు అయ్యింది… కానీ, కాలువల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.. పెద్దవూర మినీ గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సురక్షితంగా కాపాడిన పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Punjab: పీఎస్లోనే రివాల్వర్తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
మరోవైపు, కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట సహాయంగా 15,000 వేల రూపాయల నుండి 20,000 వేల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు జానారెడ్డి… నిడమనూరు నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులను ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని కోరిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ నుండి ఇళ్లల్లో నీరు చేరుకున్న ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి.. వాళ్లు తిరిగి ఇళ్లలోకి వెళ్లే వరకు బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాగా, కృష్ణా నదిలో భారీ వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఎగువ ప్రాజెక్టుల్లో నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక, సాగర్ నుంచి కూడా నీరు విడుదల చేస్తున్నారు.. అయితే, సాగర్ ఎడమ కాలువకు గండి పడి సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పలుచోట్ల భారీ పంట నష్టాన్ని మిగిల్చింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు.. నిడమానూరు మండలం ముప్పారం 39వ కిలోమీటర్ వద్ద బుధవారం సాగర్ ప్రాజెక్టుకు గండిపడిన విషయం విదితమే..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!