Jairam Ramesh: టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కాదు.. వారికి వీఆర్ఎస్ తప్పదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. వరుసగా రెండోసార్లు అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై గురిపెట్టారు.. రేపే జాతీయ పార్టీ పేరు.. జెండా, అజెండా ఖరారు చేస్తారని తెలుస్తోంది.. గులాబీ బాస్ పెట్టబోయే జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ అని ప్రచారంలో ఉంది.. అయితే, కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్… హాట్ కామెంట్లు చేశారు.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కాదు.. అసలు టీఆర్ఎస్కు వీఆర్ఎస్ తప్పదంటూ వ్యాఖ్యానించారు జైరాం రమేష్.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్కి రానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.. ఇక, మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటించారు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు.. మరి, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు, ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు దీనిపై ఏం చేశారంటూ నిలదీశారు.. ఇక, రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైనేనని స్పష్టం చేశారు జైరాం రమేష్.
Read Also: Ramakrishna: అమరావతిపై మంత్రి ధర్మాన.. అధర్మంగా మాట్లాడుతున్నారు..!
Also Read
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ఇక, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది.. కాంగ్రెస్కు భారత్ జోడో యాత్ర సంజీవని అని వ్యాఖ్యానించారు జైరాం రమేష్.. ఈ నెల 18న కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి రాహుల్ పాదయాత్ర చేరుకుంటుందన్నారు. 85 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది… నాలుగు రోజుల పాటు రోజుకు 21 కిలోమీటర్ల మేర ఏపీలో యాత్ర సాగనుందని.. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణకు వెళ్తుందని వెల్లడించారు. మరోవైపు, బీజేపీ, మిత్రపక్షాలు భారత్ జోడో యాత్రపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు జైరాం రమేష్… 3,570 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేస్తారు.. 120 మంది భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు… అందులో మూడో వంతు మహిళలు వున్నారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!