Jagadish Reddy: ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉంది మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల పై ఆయన స్పందిస్తూ..
రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా కేంద్రం వాడుకుంటుందని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ కార్యక్రమాలను రాష్ట్రపతి అడ్డుకోనప్పుడు.. రాష్ట్రాలలో గవర్నర్లు అడ్డుకోవడం ఎందుకు? అంటూ ప్రశ్నించారు. నిర్ణీత వ్యవధిలో బిల్లుల ఆమోదం కోసం సుప్రీంని ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం గవర్నర్ పనికాదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాల కంటే మెరుగ్గా పనిచేస్తున్న ఇతర పార్టీల ప్రభుత్వాల అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Shortest living Dog: ప్రపంచంలోనే అత్యంత పొట్టి కుక్క.. ఎక్కడ ఉందో తెలుసా?
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
తెలంగాణా మోడల్ అభివృద్ధి దేశమంతా అడుగుతున్నారని అక్కసుతో దుర్మార్గం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ని, తెలంగాణా అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతో కేంద్రం నాటకం ఆడుతుందని నిప్పులు చెరిగారు. శాసన సభ ప్రసంగంలో చెప్పిన అభివృద్ధి కార్యరూపం దాల్చకుండా గవర్నర్ అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తీరు భారత రాజ్యాంగం వ్యవస్థకు మంచిది కాదని మండిపడ్డారు. గవర్నర్ చర్యలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంలా మారుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోడమంటే దేశ అభివృద్ధిని అడ్డకోవడమే అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనున్న తరుణంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. రెండు బిల్లులను తిప్పి పంపించారు. మరో రెండు బిల్లులను పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే..
Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి
తాజావార్తలు
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!